Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎరుపు రంగు పైట.. తలలో పూలు... హిజ్రా వేషంలో... మోడీ బావా అంటూ పిలుపు

విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు వివిధ రూపాల్లో తమ నిరసనలు తెలుపుతున్నారు.

ఎరుపు రంగు పైట.. తలలో పూలు... హిజ్రా వేషంలో... మోడీ బావా అంటూ పిలుపు
, శుక్రవారం, 10 ఆగస్టు 2018 (12:41 IST)
విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు వివిధ రూపాల్లో తమ నిరసనలు తెలుపుతున్నారు.


ముఖ్యంగా, ఢిల్లీ వేదికగా చిత్తూరు ఎంపీ డాక్టర్ శివప్రసాద్ తెలుపుతున్న నిరసన, ఆయన వేషధారణ జాతీయ మీడియాలో ప్రధాన ఆకర్షణంగా నిలుస్తోంది. 
 
రోజుకో వేషంతో కేక పుట్టిస్తున్న శివప్రసాద్.. గురువారం హిట్లర్ వేషంలో వచ్చారు. శుక్రవారం హిజ్రాగా వచ్చి సందడి చేశారు. చెవులకు రింగులు, భుజంపై ఎరుపు రంగు పైట, తలలో కనకాంబరాలు పెట్టుకుని పార్లమెంట్ ప్రాంగణంలోకి శివప్రసాద్ వచ్చారు. 
 
నేను థర్డ్ జండర్ల ప్రతినిధిగా మోడీని నిలదీయడానికి వచ్చానని చెబుతూ, "మోడీ బావా.." అంటూ తనదైన శైలిలో చప్పట్లు కొట్టారు. "ప్రత్యేక హోదా ఇవ్వకుంటే నీ అంతం ఆరంభం" అంటూ ఓ గీతాన్ని ఆలపించారు. మాటలెన్నో చెప్పావుగానీ, చేతల్లో ఏమీ చూపలేదంటూ సెటైర్లు వేశారు. ఆయన వేషధారణ చూసిన సహచర ఎంపీలతో పాటు మీడియా మిత్రులు పగలబడి నవ్వారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరుణ మృతితో పెరిగిన సానుభూతి.. వచ్చే ఎన్నికల్లో డీఎంకే క్లీన్‌స్వీప్ ఖాయమా?