Webdunia - Bharat's app for daily news and videos

Install App

తౌక్టే తుపాను: 273మందితో కొట్టుకుపోయిన నౌక

Webdunia
సోమవారం, 17 మే 2021 (19:53 IST)
ముంబయి: అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్టే తుపాను అతి తీవ్ర తుపానుగా మారింది. ఈ తుపాను దాటికి మహారాష్ట్ర సహా పలు తీర ప్రాంతాలు వణుకుతున్నాయి. పశ్చిమ వాయువ్యం దిశగా గంటకు 20 కి.మీల వేగంతో ‘తౌక్టే’ పయనిస్తోంది.

ఈ రాత్రికి గుజరాత్‌లోని పోరుబందర్‌- మహువా మధ్య తీరం దాటనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. బలమైన ఈదురు గాలులు, భారీ వర్షాలతో తీర ప్రాంతాలను ఈ తుపాను హడలెత్తిస్తోంది.
 
ఈ రాత్రికి తౌక్టే తుపాను తీరం దాటనున్న నేపథ్యంలో వాతావరణ శాఖ ముంబయి నగరానికి ఆరెంజ్‌ హెచ్చరిక జారీచేసింది. ఐసోలేటెడ్‌ ప్రాంతాల్లో బలమైన గాలులతో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ తుపాను వల్ల వీస్తున్న భీకరగాలులతో ముంబయికి పశ్చిమ తీరాన బాంబే హైవేలో ఓ వ్యాపార నౌక కొట్టుకుపోయింది.

ఈ నౌకలో 273 మంది సిబ్బంది ఉన్నట్టు సమాచారం. విషయం తెలుసుకున్న నౌకాదళం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ఐఎన్‌ఎస్‌ కొచ్చి యుద్ధ నౌక సాయంతో గాలింపు కొనసాగిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments