Webdunia - Bharat's app for daily news and videos

Install App

తౌక్టే తుపాను: 273మందితో కొట్టుకుపోయిన నౌక

Webdunia
సోమవారం, 17 మే 2021 (19:53 IST)
ముంబయి: అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్టే తుపాను అతి తీవ్ర తుపానుగా మారింది. ఈ తుపాను దాటికి మహారాష్ట్ర సహా పలు తీర ప్రాంతాలు వణుకుతున్నాయి. పశ్చిమ వాయువ్యం దిశగా గంటకు 20 కి.మీల వేగంతో ‘తౌక్టే’ పయనిస్తోంది.

ఈ రాత్రికి గుజరాత్‌లోని పోరుబందర్‌- మహువా మధ్య తీరం దాటనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. బలమైన ఈదురు గాలులు, భారీ వర్షాలతో తీర ప్రాంతాలను ఈ తుపాను హడలెత్తిస్తోంది.
 
ఈ రాత్రికి తౌక్టే తుపాను తీరం దాటనున్న నేపథ్యంలో వాతావరణ శాఖ ముంబయి నగరానికి ఆరెంజ్‌ హెచ్చరిక జారీచేసింది. ఐసోలేటెడ్‌ ప్రాంతాల్లో బలమైన గాలులతో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ తుపాను వల్ల వీస్తున్న భీకరగాలులతో ముంబయికి పశ్చిమ తీరాన బాంబే హైవేలో ఓ వ్యాపార నౌక కొట్టుకుపోయింది.

ఈ నౌకలో 273 మంది సిబ్బంది ఉన్నట్టు సమాచారం. విషయం తెలుసుకున్న నౌకాదళం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ఐఎన్‌ఎస్‌ కొచ్చి యుద్ధ నౌక సాయంతో గాలింపు కొనసాగిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments