Webdunia - Bharat's app for daily news and videos

Install App

మదుమలై ఫారెస్ట్‌లోని ఏనుగులకు సోకిన కరోనా?

Webdunia
బుధవారం, 9 జూన్ 2021 (08:18 IST)
తమిళనాడు రాష్ట్రంలో కరోనా వైరస్ ఒకవైపు శాంతిస్తోంది. మరోవైపు, వన్యమృగాలకు ఎక్కువగా సోకుతుంది. ఇప్పటికే చెన్నై వండలూరు జూలోని సింహాలకు ఈ వైరస్ సోకింది. ఇందులో నిలా అనే ఆడ సింహం చనిపోగా, మరో సింహాలు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో మదుమలై అటవీ ప్రాంతంలోని తెప్పక్కుడి క్యాంపు ఏరియాలో ఉన్న గజరాజులకు ఈ వైరస్ సోకినట్టు అనుమానిస్తున్నారు. ఏకంగా 28 ఏనుగులకు ఈ వైరస్ సోకినట్టు అధికారులు భావిస్తున్నారు. దీంతో ఈ ఏనుగుల నుంచి నమూనాలు సేకరించిన అధికారులు... ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఇజ్జత్ నగ‌ర్‌లో ఉన్న ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు పంపారు.
 
ముందుజాగ్రత్తగా తమిళనాడులోని ముదుమలై అభయారణ్యంలో 28 ఏనుగులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. వీటిలో 26 పెద్ద ఏనుగులు కాగా, రెండు పిల్ల ఏనుగులు ఉన్నాయి. దీనిపై ముదుమలై అభయారణ్యం వెటర్నరీ నిపుణుడు డాక్టర్ కె.రాజేశ్ కుమార్ మాట్లాడుతూ, నమూనాల సేకరణలో తమకు ఏనుగులు చాలావరకు సహకరించాయన్నారు. 
 
మత్తు ఇవ్వకుండానే వాటి నుంచి నమూనాలు సేకరించామని అన్నారు. మత్తు ఇస్తే అది తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. ఫలితాల కోసం ఎదురుచూస్తున్నట్టు చెప్పారు. ఇది కేవలం పరిశీలన కోసమేనని, ఏనుగుల్లో ఏ ఒక్కదానికీ అనుమానిత లక్షణాలు లేవని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments