Webdunia - Bharat's app for daily news and videos

Install App

మదుమలై ఫారెస్ట్‌లోని ఏనుగులకు సోకిన కరోనా?

Webdunia
బుధవారం, 9 జూన్ 2021 (08:18 IST)
తమిళనాడు రాష్ట్రంలో కరోనా వైరస్ ఒకవైపు శాంతిస్తోంది. మరోవైపు, వన్యమృగాలకు ఎక్కువగా సోకుతుంది. ఇప్పటికే చెన్నై వండలూరు జూలోని సింహాలకు ఈ వైరస్ సోకింది. ఇందులో నిలా అనే ఆడ సింహం చనిపోగా, మరో సింహాలు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో మదుమలై అటవీ ప్రాంతంలోని తెప్పక్కుడి క్యాంపు ఏరియాలో ఉన్న గజరాజులకు ఈ వైరస్ సోకినట్టు అనుమానిస్తున్నారు. ఏకంగా 28 ఏనుగులకు ఈ వైరస్ సోకినట్టు అధికారులు భావిస్తున్నారు. దీంతో ఈ ఏనుగుల నుంచి నమూనాలు సేకరించిన అధికారులు... ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఇజ్జత్ నగ‌ర్‌లో ఉన్న ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు పంపారు.
 
ముందుజాగ్రత్తగా తమిళనాడులోని ముదుమలై అభయారణ్యంలో 28 ఏనుగులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. వీటిలో 26 పెద్ద ఏనుగులు కాగా, రెండు పిల్ల ఏనుగులు ఉన్నాయి. దీనిపై ముదుమలై అభయారణ్యం వెటర్నరీ నిపుణుడు డాక్టర్ కె.రాజేశ్ కుమార్ మాట్లాడుతూ, నమూనాల సేకరణలో తమకు ఏనుగులు చాలావరకు సహకరించాయన్నారు. 
 
మత్తు ఇవ్వకుండానే వాటి నుంచి నమూనాలు సేకరించామని అన్నారు. మత్తు ఇస్తే అది తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. ఫలితాల కోసం ఎదురుచూస్తున్నట్టు చెప్పారు. ఇది కేవలం పరిశీలన కోసమేనని, ఏనుగుల్లో ఏ ఒక్కదానికీ అనుమానిత లక్షణాలు లేవని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments