Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావళికి బంగారం పెట్టలేదు.. పెళ్లైన మూడు నెలలకే..?

Webdunia
సోమవారం, 19 నవంబరు 2018 (11:12 IST)
పెళ్లైన మూడు నెలలకే ఓ వివాహిత ప్రాణాలు కోల్పోయింది. దీపావళి పండుగకు బంగారం పెట్టలేదనే కోపంతో భర్త, అత్తమామలే ఆమెను హత్య చేసినట్లు యువతి తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 
 
వివరాల్లోకి వెళితే.. కాంచీపురం జిల్లా చిన్నకంచికి చెందిన నటరాజన్ కుమార్తె రూపవతి (29). ఈమెకు తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరుకు చెందిన కృష్ణస్వామి కుమారుడు యువరాజ్‌తో సెప్టెంబర్ 12న కాంచీపురంలో వివాహం జరిగింది. యువరాజ్ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. దీపావళికి యువరాజ్ దంపతులు కాంచీపురం వెళ్లారు. 
 
పెళ్లై తొలి దీపావళి కావడంతో పెళ్ళికొడుకు బంగారు నగలు ఇవ్వడం సాంప్రదాయం. కానీ ఇటీవల వివాహం చేసి వుండటం డబ్బు చేతిలో సరిపడా లేక పోవడంతో.. కొత్త అల్లుడికి బంగారం పెట్టలేకపోయారు. ఇదే సాకుగా చూపి యువరాజ్ భార్యను వేధించినట్లు తెలుస్తోంది. ఈ వేధింపులు తాళలేక.. రూపవతి ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి బంగారం పెట్టాలని కోరింది. 
 
ఇంతలోపే.. ఆమె మరణించినట్లు సమాచారం అందడంతో.. ఆమె తల్లిదండ్రులు బోరున విలపించారు. కానీ యువరాజ్ మాత్రం కడుపులో నొప్పిగా వుందని.. ఆస్పత్రికి తీసుకెళ్లే లోపే చనిపోయిందని చెప్తున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

గుంటూరు కారం మెట్టు దిగింది.. 'గుడ్ బ్యాడ్ అగ్లీ'లో అజిత్‌తో శ్రీలీల

నా సినిమాల గురించి నికోలయ్ నిర్మొహమాటంగా చెబుతారు : శబరి నటి వరలక్ష్మీ శరత్ కుమార్

ఆశిష్, వైష్ణవి చైతన్య, దిల్‌రాజు ప్రొడక్షన్స్ లవ్ మీ- ఇఫ్ యు డేర్

కాజల్ అగర్వాల్ సత్యభామ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతుంది

పృథ్వీ హీరోగా, రూపాలి, అంబిక హీరోయిన్లుగా చిత్రం ప్రారంభం

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

రొమ్ము క్యాన్సర్ శస్త్ర చికిత్సలో మంగళగిరిలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ వినూత్నమైన మత్తు విధానం

డ్రై ఫ్రూట్స్ హల్వా తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments