Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావళికి బంగారం పెట్టలేదు.. పెళ్లైన మూడు నెలలకే..?

Webdunia
సోమవారం, 19 నవంబరు 2018 (11:12 IST)
పెళ్లైన మూడు నెలలకే ఓ వివాహిత ప్రాణాలు కోల్పోయింది. దీపావళి పండుగకు బంగారం పెట్టలేదనే కోపంతో భర్త, అత్తమామలే ఆమెను హత్య చేసినట్లు యువతి తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 
 
వివరాల్లోకి వెళితే.. కాంచీపురం జిల్లా చిన్నకంచికి చెందిన నటరాజన్ కుమార్తె రూపవతి (29). ఈమెకు తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరుకు చెందిన కృష్ణస్వామి కుమారుడు యువరాజ్‌తో సెప్టెంబర్ 12న కాంచీపురంలో వివాహం జరిగింది. యువరాజ్ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. దీపావళికి యువరాజ్ దంపతులు కాంచీపురం వెళ్లారు. 
 
పెళ్లై తొలి దీపావళి కావడంతో పెళ్ళికొడుకు బంగారు నగలు ఇవ్వడం సాంప్రదాయం. కానీ ఇటీవల వివాహం చేసి వుండటం డబ్బు చేతిలో సరిపడా లేక పోవడంతో.. కొత్త అల్లుడికి బంగారం పెట్టలేకపోయారు. ఇదే సాకుగా చూపి యువరాజ్ భార్యను వేధించినట్లు తెలుస్తోంది. ఈ వేధింపులు తాళలేక.. రూపవతి ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి బంగారం పెట్టాలని కోరింది. 
 
ఇంతలోపే.. ఆమె మరణించినట్లు సమాచారం అందడంతో.. ఆమె తల్లిదండ్రులు బోరున విలపించారు. కానీ యువరాజ్ మాత్రం కడుపులో నొప్పిగా వుందని.. ఆస్పత్రికి తీసుకెళ్లే లోపే చనిపోయిందని చెప్తున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajendra prasad: నేను సరదాగా మాట్లాడతాను. అర్థంకాకపోతే అది మీ ఖర్మ: రాజేంద్రప్రసాద్

ఎక్కడ ఆ లం- కొడుకు? నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ బూతు కిరీటి అవుతున్నారా?

నాన్నగారి సంవత్సరికం తర్వాత మా పెళ్లి : నారా రోహిత్

Khaleja: ఖలేజా రీ-రిలీజ్- మొదటి రోజే రూ.8కోట్లు.. ఆల్ టైమ్ రికార్డ్ నమోదు

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments