Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావళికి బంగారం పెట్టలేదు.. పెళ్లైన మూడు నెలలకే..?

Webdunia
సోమవారం, 19 నవంబరు 2018 (11:12 IST)
పెళ్లైన మూడు నెలలకే ఓ వివాహిత ప్రాణాలు కోల్పోయింది. దీపావళి పండుగకు బంగారం పెట్టలేదనే కోపంతో భర్త, అత్తమామలే ఆమెను హత్య చేసినట్లు యువతి తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 
 
వివరాల్లోకి వెళితే.. కాంచీపురం జిల్లా చిన్నకంచికి చెందిన నటరాజన్ కుమార్తె రూపవతి (29). ఈమెకు తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరుకు చెందిన కృష్ణస్వామి కుమారుడు యువరాజ్‌తో సెప్టెంబర్ 12న కాంచీపురంలో వివాహం జరిగింది. యువరాజ్ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. దీపావళికి యువరాజ్ దంపతులు కాంచీపురం వెళ్లారు. 
 
పెళ్లై తొలి దీపావళి కావడంతో పెళ్ళికొడుకు బంగారు నగలు ఇవ్వడం సాంప్రదాయం. కానీ ఇటీవల వివాహం చేసి వుండటం డబ్బు చేతిలో సరిపడా లేక పోవడంతో.. కొత్త అల్లుడికి బంగారం పెట్టలేకపోయారు. ఇదే సాకుగా చూపి యువరాజ్ భార్యను వేధించినట్లు తెలుస్తోంది. ఈ వేధింపులు తాళలేక.. రూపవతి ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి బంగారం పెట్టాలని కోరింది. 
 
ఇంతలోపే.. ఆమె మరణించినట్లు సమాచారం అందడంతో.. ఆమె తల్లిదండ్రులు బోరున విలపించారు. కానీ యువరాజ్ మాత్రం కడుపులో నొప్పిగా వుందని.. ఆస్పత్రికి తీసుకెళ్లే లోపే చనిపోయిందని చెప్తున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments