Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు.. ఒక్క రోజే 600 కేసులు

Webdunia
శుక్రవారం, 8 మే 2020 (19:56 IST)
తమిళనాడులో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. శుక్రవారం కొత్తగా 600 కరోనా కేసులు నమోదైనాయి. ఇందులో చెన్నై నగరంలోనే 399 కేసులు నమోదు అయ్యాయని తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి సీ విజయభాస్కర్‌ వెల్లడించారు. దీంతో మొత్తంగా రాష్ట్రంలో 5409 కరోనా కేసులు నమోదవగా, 37 మంది మరణించారని తెలిపారు. 
 
ప్రస్తుతం 3825 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, మరో 1547 మంది బాధితులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారని తెలిపారు. రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా నమోదవుతున్నా..మృతుల సంఖ్య మాత్రం చాలా తక్కువగా ఉందని అధికార వర్గాలు తెలిపాయి. 
 
త్వరలోనే కరోనా వైరస్‌ను పూర్తిస్థాయిలో అదుపులోకి తీసుకొచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అయితే.. రోజూ వందల సంఖ్యలో నమోదు అవుతున్న పాజిటివ్ కేసులతో ప్రజలు మాత్రం తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments