Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆన్‌లైన్‌ తరగతులు అర్థం కాలేదు... ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థిని

Webdunia
బుధవారం, 9 సెప్టెంబరు 2020 (13:14 IST)
కరోనా వైరస్ కారణంగా ఆన్‌లైన్‌ తరగతులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఆన్ లైన్ క్లాసుల కోసం విద్యార్థులు స్మార్ట్ ఫోన్లు లేకుండా... నెట్ లేకుండా నానా తంటాలు పడుతున్నారు. ఇటీవలే స్మార్ట్ ఫోన్ కొనిపెట్టలేదని ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడింది. తాజాగా ఆన్‌లైన్‌ తరగతులు అర్ధం కాకపోవడంతో బీఈలో చేరిన విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. 
 
వివరాల్లోకి వెళితే.. తిరుచ్చి సంగిలియాండపురం ప్రాంతానికి చెందిన లత (17) తిరుచ్చి శ్రీమతి ఇందిరాగాంధీ మహిళా కళాశాలలో బీఈ మొదటి సంవత్సరంలో చేరింది. ప్రస్తుతం మొదటి సంవత్సర విద్యార్థులకు ఆన్‌లైన్‌లో విద్యాబోధన జరుగుతోంది. 
 
ప్లస్‌ టూలో తమిళంలో చదువుకున్న లత ఆన్‌లైన్‌లో ఇంగ్లీషులో బోధన జరుగుతుండడంతో ఆ పాఠాలు ఆమెకు అర్థం కావడం లేదు. దీంతో మనస్తాపం చెందిన ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై పాలకరై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments