Webdunia - Bharat's app for daily news and videos

Install App

అగ్నిప్రమాదం జరిగిన రైలు బోగీలో కాలిన నోట్ల కట్టలు

Webdunia
సోమవారం, 28 ఆగస్టు 2023 (09:59 IST)
మదురై రైల్వే స్టేషన్‌లో గ్యాస్ సిలిండర్ పేలడంతో జరిగిన అగ్నిప్రమాదంలో ఓ రైలు బోగీ పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది యాత్రికులు సజీవ దహనమయ్యారు. అయితే, ఈ బోగీని క్షుణ్ణంగా గాలించగా, సగం కాలిపోయిన నోట్ల కట్టలను విచారణ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. తమ దారి ఖర్చుల కోసం యాత్రికులు ఈ డబ్బులు తెచ్చుకుని ఉంటారని భావిస్తున్నారు. 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 62 మంది భక్తులు ప్రైవేటు పార్టీ ఆధ్వర్యంలో రామేశ్వరం వరకు ఆధ్యాత్మిక పర్యటన కోసం వచ్చారు. వీరంతా కలిసి ఓ రైలు బోగీని మాట్లాడుకుని, అందులో వచ్చారు. అయితే, ఈ రైలు బోగీని మదురై స్టేషన్‌లో ఆపి వుంచగా అక్రమంగా బోగీలోకి తీసుకొచ్చిన గ్యాస్ సిలిండర్ పేలడంతో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
శనివారం తెల్లవారుజామున దగ్ధమైన ఘటనపై విచారణ జరుగుతోంది. ఆదివారం ఫోరెన్సిక్ నిపుణులు కోచ్‌లో తనిఖీలు చేసారు. ఓ పెట్టెలో సగం కాలిన నోట్లు భారీగా బయటపడ్డాయి. రూ.200, రూ.500 నోట్లు అందులో ఉన్నట్లు గుర్తించారు. యాత్రికుల కోసం దారిలో ఖర్చులకు ట్రావెల్ ఏజెన్సీ వారు తెచ్చుకున్నట్లు భావిస్తున్నారు. 
 
మొత్తం 63 మంది ప్రయాణికులు లక్నో నుంచి ప్రత్యేక కోచ్‌లో తమిళనాడుకు వచ్చారు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఇద్దరు వ్యక్తులు మాయమైనట్లు గుర్తించారు. వారికోసం ఆదివారం ప్రత్యేక బలగాలతో తనిఖీలు చేపట్టారు. చివరికి వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ప్రమాదంతో వారికేమైనా సంబంధం ఉందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. దక్షిణ సర్కిల్ కమిషనర్ ఆఫ్ రైల్వేసేఫ్టీ ఏఎం చౌదరి ఘటనాస్థలిలో విచారణ చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments