Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళ రాజకీయాల్లో కుదుపు.. టీటీవీ వర్గ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు

తమిళ రాజకీయాలు మరోమారు భారీ కుదుపునకు లోనయ్యాయి.

Webdunia
సోమవారం, 18 సెప్టెంబరు 2017 (11:39 IST)
తమిళ రాజకీయాలు మరోమారు భారీ కుదుపునకు లోనయ్యాయి. ఈ కుదుపు అధికార అన్నాడీఎంకేలో మరో సంక్షోభానికి దారితీసేలా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామికి వ్యతిరేకంగా గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల్లో 18 మందిపై ఆ రాష్ట్ర శాసనసభ స్పీకర్ పి.ధనపాల్ అనర్హత వేటువేశారు. స్పీకర్ నిర్ణయంతో పళనిస్వామి ప్రభుత్వానికి పెద్ద ఊరట లభించినట్టయింది. 
 
మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో చేతులు కలిపినందుకు ముఖ్యమంత్రి పళనిస్వామిపై టీటీవీ దినకరన్ వర్గానికి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన విషయం తెల్సిందే. వీరిలో 21 మంది ఎమ్మెల్యేలు తాత్కాలిక గవర్నర్ సీహె.విద్యాసాగర్ రావును కలిసి సీఎంకు తమ మద్దతు ఉపసంహరించుకుంటున్నట్టు ఫిర్యాదు చేశారు. 
 
ఈ వ్యవహారాన్న సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వ విప్ గవర్నర్‌ను కలిసిన ఎమ్మెల్యేలపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో తిరుగుబాటు ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీచేసి వివరణ కోరారు. ఈ నేపథ్యంలో తాత్కాలిక గవర్నర్ సోమవారం చెన్నైకు రానున్నారు. ఇలాంటి తరుణంలో స్పీకర్ ధనపాల్ 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ ఆదేశారు జారీ చేశారు. స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం ఇపుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

తెలుగురాని అమ్మాయిలను బాగా ప్రేమిస్తాం... ఎంకరేజే చేస్తాం : నిర్మాత ఎస్‌కేఎన్ (Video)

కిరణ్ అబ్బవరం దిల్ రూబా నుంచి సెకండ్ సింగిల్ హే జింగిలి..రాబోతుంది

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments