Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళ రాజకీయాల్లో కుదుపు.. టీటీవీ వర్గ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు

తమిళ రాజకీయాలు మరోమారు భారీ కుదుపునకు లోనయ్యాయి.

Webdunia
సోమవారం, 18 సెప్టెంబరు 2017 (11:39 IST)
తమిళ రాజకీయాలు మరోమారు భారీ కుదుపునకు లోనయ్యాయి. ఈ కుదుపు అధికార అన్నాడీఎంకేలో మరో సంక్షోభానికి దారితీసేలా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామికి వ్యతిరేకంగా గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల్లో 18 మందిపై ఆ రాష్ట్ర శాసనసభ స్పీకర్ పి.ధనపాల్ అనర్హత వేటువేశారు. స్పీకర్ నిర్ణయంతో పళనిస్వామి ప్రభుత్వానికి పెద్ద ఊరట లభించినట్టయింది. 
 
మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో చేతులు కలిపినందుకు ముఖ్యమంత్రి పళనిస్వామిపై టీటీవీ దినకరన్ వర్గానికి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన విషయం తెల్సిందే. వీరిలో 21 మంది ఎమ్మెల్యేలు తాత్కాలిక గవర్నర్ సీహె.విద్యాసాగర్ రావును కలిసి సీఎంకు తమ మద్దతు ఉపసంహరించుకుంటున్నట్టు ఫిర్యాదు చేశారు. 
 
ఈ వ్యవహారాన్న సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వ విప్ గవర్నర్‌ను కలిసిన ఎమ్మెల్యేలపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో తిరుగుబాటు ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీచేసి వివరణ కోరారు. ఈ నేపథ్యంలో తాత్కాలిక గవర్నర్ సోమవారం చెన్నైకు రానున్నారు. ఇలాంటి తరుణంలో స్పీకర్ ధనపాల్ 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ ఆదేశారు జారీ చేశారు. స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం ఇపుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments