Webdunia - Bharat's app for daily news and videos

Install App

బురేవి బీభత్సం.. తమిళనాడులో ఏడుగురు మృతి.. పదిలక్షల ఎక్స్‌గ్రేషియా

Webdunia
శనివారం, 5 డిశెంబరు 2020 (21:37 IST)
బురేవి తుఫాను బీభత్సం సృష్టించింది. ఈ తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాల ధాటికి తమిళనాడులో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. బురేవి ధాటి తీర ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. 
 
ఈ నేపథ్యంలో బురేవి తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని సీఎం పళనిస్వామి అధికారులను ఆదేశించారు. వరదల్లో మృతిచెందిన వారికి రూ.10లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.
 
రామేశ్వరంలోని తీర ప్రాంత గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రాష్ట్రంలో తుఫాను పరిస్థితిపై సీఎం పళనిస్వామి సమీక్షించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు 11మంది మంత్రులను నియమించారు. 
 
ఈ తుఫాను ప్రభావంతో అత్యధికంగా కడలూరు జిల్లాలో వర్షాలు కురిశాయి. 2వేలకు పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇళ్లు దెబ్బతిన్నవారికి, మూగజీవాలు నష్టపోయిన రైతులకు సీఎం పరిహారం ప్రకటించారు. మరోవైపు, సహాయక చర్యల కోసం 14 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను రంగంలోకి దించారు. 

సంబంధిత వార్తలు

భార్య భర్తల అహం తో విద్య వాసుల అహం చిత్రం - ట్రైలర్ కు స్పందన

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజ్

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments