Webdunia - Bharat's app for daily news and videos

Install App

శతాధిక దంపతులు ఒకే సారి కన్నుమూశారు.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 13 నవంబరు 2019 (16:08 IST)
తమిళనాడు రాష్ట్రంలో ఓ విషాదకర సంఘటన ఒకటి చోటుచేసుకుంది. శతాధిక దంపతుల జోడి ఒకేసారి తనువు చాలించింది. మనుమలు, మనుమరాండ్లు, మునిమళ్లను కూడా చూసిన ఆ జంట... ఒకేసారి చనిపోవడంతో ఆ ఇంట్లోనే కాదు, ఆ గ్రామంలోనే విషాదఛాయలు అలముకున్నాయి. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తమిళనాడు రాష్ట్రంలోని కుప్పకూడి గ్రామానికి చెందిన వెట్రివేల్ (104), పిచాయి (100) అనే శతాధిక దంపతులు ఉన్నారు. వీరికి ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె. వీరందరికీ వివాహాలు అయిపోయాయి. ఫలితంగా ఈ వృద్ధ జంటకు 23 మంది మనవళ్లు, మనుమరాండ్లు, మునిమనుమళ్ళు ఉన్నారు. వీరంతా ఉమ్మడి కుటుంబంగానే ఉంటున్నారు. 
 
ఈ క్రమంలో సోమవారం రాత్రి వెట్రివేల్‌కు ఛాతిలో నొప్పి రావడంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆయన అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. ఆ తర్వాత వెట్రివేల్ మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. భర్త శవం పక్కనే కూర్చున్న పిచాయి కన్నీరు పెడుతూ మూర్ఛపోయింది. 
 
దీంతో వైద్యులను పిలిపించి పరీక్షించగా, ఆమె కూడా ప్రాణాలు విడినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో 80 యేళ్ళ వైవాహిక బంధం ముగిసిపోయింది. ఈ శతాధిక వృద్ధులు చనిపోవడంతో ఆ ఇంట్లోనే కాదు గ్రామంలో కూడా విషాదఛాయలు అలముకున్నాయి. 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments