Webdunia - Bharat's app for daily news and videos

Install App

శతాధిక దంపతులు ఒకే సారి కన్నుమూశారు.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 13 నవంబరు 2019 (16:08 IST)
తమిళనాడు రాష్ట్రంలో ఓ విషాదకర సంఘటన ఒకటి చోటుచేసుకుంది. శతాధిక దంపతుల జోడి ఒకేసారి తనువు చాలించింది. మనుమలు, మనుమరాండ్లు, మునిమళ్లను కూడా చూసిన ఆ జంట... ఒకేసారి చనిపోవడంతో ఆ ఇంట్లోనే కాదు, ఆ గ్రామంలోనే విషాదఛాయలు అలముకున్నాయి. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తమిళనాడు రాష్ట్రంలోని కుప్పకూడి గ్రామానికి చెందిన వెట్రివేల్ (104), పిచాయి (100) అనే శతాధిక దంపతులు ఉన్నారు. వీరికి ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె. వీరందరికీ వివాహాలు అయిపోయాయి. ఫలితంగా ఈ వృద్ధ జంటకు 23 మంది మనవళ్లు, మనుమరాండ్లు, మునిమనుమళ్ళు ఉన్నారు. వీరంతా ఉమ్మడి కుటుంబంగానే ఉంటున్నారు. 
 
ఈ క్రమంలో సోమవారం రాత్రి వెట్రివేల్‌కు ఛాతిలో నొప్పి రావడంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆయన అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. ఆ తర్వాత వెట్రివేల్ మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. భర్త శవం పక్కనే కూర్చున్న పిచాయి కన్నీరు పెడుతూ మూర్ఛపోయింది. 
 
దీంతో వైద్యులను పిలిపించి పరీక్షించగా, ఆమె కూడా ప్రాణాలు విడినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో 80 యేళ్ళ వైవాహిక బంధం ముగిసిపోయింది. ఈ శతాధిక వృద్ధులు చనిపోవడంతో ఆ ఇంట్లోనే కాదు గ్రామంలో కూడా విషాదఛాయలు అలముకున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

రోడ్డు ప్రమాదంలో 'దసరా' మూవీ విలన్ తండ్రి దుర్మరణం

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments