Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెన్త్ చదివే మరదలిపై అత్యాచారం.. గర్భస్రావానికి యత్నించడంతో...

Webdunia
సోమవారం, 17 జూన్ 2019 (20:49 IST)
పదో తరగతి చదివే మరదలిపై అత్యాచారం ఓ ప్రబుద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆయన ఏళ్ళ తరబడి ఈ పాడుపని చేస్తూ వచ్చాడు. చివరకు ఆ బాలిక గర్భందాల్చింది. దీంతో అబార్షన్ చేయించేందుకు ప్రయత్నించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లా కరుత్తన్‌గోడుకు చెందిన అయ్యప్పన్ (30) అనే వ్యక్తి స్థానికంగా భవన నిర్మాణ కాంట్రాక్టర్‌గా ఉంటున్నారు. ఈయన ఐదేళ్ల క్రితం ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లులు కూడా ఉన్నారు. 
 
అయితే, పదో తరగతి చదువుతున్న భార్య చెల్లెలిపై కన్నేసిన అయ్యప్పన్ ఆమెను మాయమాటలతో లోబరుచుకున్నాడు. ఆమెపై కొన్నేళ్లుగా అత్యాచారం చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ఆ యువతి గర్భం దాల్చింది. దీంతో అబార్షన్ చేయించేందుకు ఇటీవల ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ వైద్యులు అనుమానించి పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగుచూసింది. 
 
దీంతో అయ్యప్పన్ ఆ బాలికను ఆస్పత్రిలోనే వదిలిపెట్టి పారిపోయాడు. ఆ తర్వాత పోలీసులు అక్కడకు వచ్చి బాలికను విచారించగా, అసలు విషయం వెలుగుచూసింది. దీనిపై బాధితురాలు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... కేసు నమోదు చేసి పరారీలో ఉన్న అయ్యప్పన్ కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments