Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాట రైతన్న కడుపుకోత.. హస్తినలో పుర్రెలతో ఆందోళనలు

తమిళనాడు రాష్ట్రానికి చెందిన రైతులు ఢిల్లీలో ఆందోళనకు దిగారు. సుప్రీంకోర్టు ఆదేశానుసారం కావేరీ జలాల పర్యవేక్షణ బోర్డును తక్షణం ఏర్పాటు, రైతు రుణాలను మాఫీ చేయాలని, హైడ్రోకార్బన్ ప్రాజెక్టును రద్దు తదిత

Webdunia
శనివారం, 18 మార్చి 2017 (16:34 IST)
తమిళనాడు రాష్ట్రానికి చెందిన రైతులు ఢిల్లీలో ఆందోళనకు దిగారు. సుప్రీంకోర్టు ఆదేశానుసారం కావేరీ జలాల పర్యవేక్షణ బోర్డును తక్షణం ఏర్పాటు, రైతు రుణాలను మాఫీ చేయాలని, హైడ్రోకార్బన్ ప్రాజెక్టును రద్దు తదితర డిమాండ్లతో వారు హస్తిలోని జంతర్‌మంతర్ వద్ద ఆందోళనకు దిగారు. ఈ ధర్నాలో పాల్గొన్న రైతులు.. అప్పులు, కరవు వల్ల ఆత్మహత్యలు చేసుకున్న రైతుల పుర్రెలు, ఎముకలతో పాటు... భిక్షం అడుక్కుంటున్నట్టుగా చేతిలో చిప్పలు పట్టుకుని నిరసన వ్యక్తం చేయడం గమనార్హం. 
 
కాగా, గత యేడాది తమిళనాడు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కరవు నెలకొంది. నైరుతి, ఈశాన్య రుతుపవనాలు పూర్తిగా ముఖం చాటేయడంతో పాటు.. కర్ణాటక ప్రభుత్వం కావేరీ జలాలను విడుదల చేయకపోవడంతో గత 140 యేళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రం కరవు కోరల్లో చిక్కుకుంది. దీంతో లక్షలాది మంది రైతులు, రైతు కూలీలు ఉపాధిని కోల్పోయి ఓ పూట భోజనం కోసం అల్లాడుతున్నారు. ఈ కరవు వల్ల సుమారు 400 మందికి పైగా ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. 
 
ముఖ్యంగా ఒక నెల రోజుల వ్యవధిలో 106 మంది అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడటంతో రైతులు ఆందోళన చెంది ఢిల్లీలో నిరసనకు దిగారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల్లో ఎక్కువ మంది తీసుకున్న రుణాలు చెల్లించలేక చనిపోయారు. దీంతో తక్షణం రుణ మాఫీ చేయాలని ఆందోళన చేస్తున్న రైతుల ప్రధాన డిమాండ్‌గా ఉంది. 
 
మరోవైపు కరవు పీడిత జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం 32,30,191 మంది రైతులకు రూ.2247 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. దీనిపై రైతులు స్పందిస్తూ ఒక ఎకరాకు రూ.45 వేల అప్పు ఉందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం రూ.3 వేల ఆర్థిక సాయం ఇస్తే ఎలా సరిపోతుందని ప్రశ్నిస్తున్నారు. అందువల్ల ప్రభుత్వం రుణాలు చెల్లించేందుకు కనీస మొత్తాన్ని ప్రభుత్వం సాయం చేయాలని కోరారు.

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం