Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిజాబ్ ధరించి వచ్చి ఓటేసేందుకు వచ్చిన మహిళను అడ్డుకున్న బీజేపీ ఏజెంట్

Webdunia
శనివారం, 19 ఫిబ్రవరి 2022 (17:57 IST)
తమిళనాడు రాష్ట్రంలో నగర, పురపాలక, పట్టణ పంచాయతీలకు శనివారం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో రాష్ట్ర ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. అంతా ప్రశాంతంగా సాగుతుందని భావించిన తరుణంలో మదురైలో హిజాబ్ వివాదం చెలరేగింది. పోలింగ్ కేంద్రానికి హిజాబ్ ధరించి వచ్చిన ఓ ముస్లిం మహిళను ఓటు వేయకుండా బీజేపీ అభ్యర్థి తరపు ఏజెంట్ అడ్డుకున్నారు. దీంతో పోలింగ్ కేంద్రంలో ఉద్రిక్తత ఏర్పడింది. 
 
హిజాబ్ తొలగించిన తర్వాత తర్వాతే ఆ మహిళ ఓటు వేయాలని, అపుడే ఓటు వేయడానికి అనుమతించాలంటూ బీజేపీ ఏజెంట్ పోలింగ్‌ బూత్‌లో వీరంగం సృష్టించాడు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఆ తర్వాత డీఎంకే, అన్నాడీఎంకే సహా ఇతర పోలింగ్ ఏజెంట్లు సదరు బీజేపీ ఏజెంట్‌ను పోలింగ్ బూత్ నుంచి బయటకు పంపించాలంటూ డిమాండ్ చేయడంతో పోలీసులు జోక్యం చేసుకుని బీజేపీ ఏజెంట్‌ను బయటకు పంపించారు. ఆ తర్వాత ఆ మహిళ ఓటు హక్కును వినియోగించుకుంది. కాగా, కర్నాటక రాష్ట్రంలో తలెత్తిన హిజాబ్ వివాదం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పాకింది. ఇపుడు తమిళనాడు ఎన్నికల్లో ఈ వివాదం తలెత్తింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments