Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో ఎదురెదురుగా ఢీకొన్న ప్రైవేటు బస్సులు - ఐదుగురి మృతి

Webdunia
సోమవారం, 19 జూన్ 2023 (15:09 IST)
తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లాలో రెండు ప్రైవేటు బస్సు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృత్యువాతపడ్డారు. మరో 80 మంది వరకు గాయపడ్డారు. క్షతగాత్రులను కడలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నెల్లికుప్పం సమీపంలోని పట్టంబాక్కం వద్ద సోమవారం ఉదయం ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. కడలూరు నుంచి వేగంగా వెళ్తున్న ప్రైవేటు బస్సు ముందు టైరు పేలి పోవడంతో ఒక్కసారిగా అదుపు తప్పిపోయింది. అదేసమయంలో బన్రుట్టి నుంచి కడలూరు వైపు వస్తున్న మరో ప్రైవేటు బస్సును బలంగా ఢీకొట్టింది. 
 
ఈ దుర్ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని స్థానికుల సహకారంతో క్షతగాత్రులను బయటకి తీశారు. ఈ ఘటనపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments