Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో ఎదురెదురుగా ఢీకొన్న ప్రైవేటు బస్సులు - ఐదుగురి మృతి

Webdunia
సోమవారం, 19 జూన్ 2023 (15:09 IST)
తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లాలో రెండు ప్రైవేటు బస్సు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృత్యువాతపడ్డారు. మరో 80 మంది వరకు గాయపడ్డారు. క్షతగాత్రులను కడలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నెల్లికుప్పం సమీపంలోని పట్టంబాక్కం వద్ద సోమవారం ఉదయం ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. కడలూరు నుంచి వేగంగా వెళ్తున్న ప్రైవేటు బస్సు ముందు టైరు పేలి పోవడంతో ఒక్కసారిగా అదుపు తప్పిపోయింది. అదేసమయంలో బన్రుట్టి నుంచి కడలూరు వైపు వస్తున్న మరో ప్రైవేటు బస్సును బలంగా ఢీకొట్టింది. 
 
ఈ దుర్ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని స్థానికుల సహకారంతో క్షతగాత్రులను బయటకి తీశారు. ఈ ఘటనపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎండ్‌కార్డు వరకు సస్పెన్స్ కొనసాగుతుంది - 'ఒక పథకం ప్రకారం' డైరెక్టర్ వినోద్ కుమార్ విజయన్

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతి లీలావతి'

'గేమ్ ఛేంజర్' కలెక్షన్లపై అల్లు అరవింద్ సెటైర్లు - ముందుంది మొసళ్ల పండుగ అంటున్న మెగాఫ్యాన్స్!

ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ అర్చన

ఫహాద్ ఫాజిల్ - రాజ్ కుమార్ రావ్ బాటలో దూసుకు పోతున్న రాగ్ మయూర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లొట్టలు వేస్తూ మైసూర్ బోండా తినేవాళ్లు తెలుసుకోవాల్సినవి

2025 వెడ్డింగ్ కలెక్షన్‌ను లాంచ్ చేసిన తస్వ ఎక్స్ తరుణ్ తహిలియాని

ఆకాకర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

కేన్సర్ జీనోమ్ డేటాబేస్‌ను ప్రారంభించిన ఐఐటీ-మద్రాస్

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

తర్వాతి కథనం
Show comments