Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆదేశాలు బేఖాతర్ : చర్యలకు ఎన్నికల సంఘం ఆదేశాలు

Webdunia
ఆదివారం, 2 మే 2021 (14:26 IST)
త‌మ ఆదేశాల‌ను బేఖాత‌రు చేసి ఎన్నిక‌ల సంబ‌రాల‌ను జ‌రుపుకుంటున్న వారిపై వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల్సిందిగా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆదేశించింది. దేశంలో కొవిడ్ సంక్షోభం కార‌ణంగా విజ‌యోత్స‌వ ర్యాలీలు, సంబ‌రాల‌పై ఈసీ నిషేధం విధించిన విషయం తెల్సిందే. 
 
అయినా కూడా ఈ ఆదేశాలను ఎవ‌రూ పాటించ‌డం లేదు. ప‌శ్చిమ బెంగాల్‌, త‌మిళ‌నాడుల‌లో ఆయా పార్టీల కార్య‌క‌ర్త‌లు రోడ్ల‌పైకి వ‌చ్చి సంబ‌రాలు చేసుకుంటున్నారు. ఈ విష‌యాన్ని తీవ్రంగా ప‌రిగ‌ణించిన ఎన్నికల సంఘం... వెంట‌నే వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించింది.
 
మరోవైపు, కేంద్రం హోం మంత్రి అమిత్ షాకు తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సీనియర్ నేత డెరెక్‌ ఒబ్రెయిన్ గట్టి కౌంటరిచ్చారు. ఈ ఎన్నికల్లో టీఎంసీ దూసుకుపోతున్న విషయం తెల్సిందే. దీంతో టీఎంసీ వరుసగా మూడోసారి అధికారంలోకి రానుంది. 
 
తాజా ఫలితాల నాటికి 200కు పైగా స్థానాల్లో టీఎంసీ ఆధిక్యంలో ఉంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్‌ నేత డెరెక్‌ ఒబ్రెయిన్‌, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు కౌంటర్‌ ఇచ్చారు. 
 
బెంగాల్‌లో బీజేపీ 200 స్థానాలు గెలుస్తుందన్న ఆయన ప్రసంగం క్లిప్‌ను ఎమోజీలతో ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. పశ్చిమ బెంగాల్‌లో విజయం కోసం ప్రధాని మోడీ, అమిత్‌ షా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయిందని పరోక్షంగా విమర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments