Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతులతో గుంజీలు తీయించిన తహసీల్దార్.. ఎందుకో తెలుసా?

Webdunia
సోమవారం, 9 నవంబరు 2020 (21:56 IST)
ఒరిస్సా రాష్ట్రం అనుగుల్‌ జిల్లా కిశోర్‌నగర్‌ ప్రాంతం పండురియా గ్రామానికి చెందిన రైతులు మగుణిసాహు, సుసాంత్‌ రాణాలు పొలానికి వెళ్లి ద్విచక్ర వాహనంపై తిరిగొస్తున్నారు.

మార్గమధ్యంలో కాలేజీ చౌక్‌ వద్ద పోలీసులతో కలసి తనిఖీలు చేస్తున్న తహసీల్దారు లక్ష్మీప్రసాద్‌ సాహు వీరిని అడ్డుకున్నారు. మాస్కులు సరిగా ధరించలేదంటూ దుర్భాషలాడి, రూ.500 అపరాధరుసుం చెల్లించాలన్నారు. 
 
పొలం పనుల నుంచి వస్తున్న తమ వద్ద డబ్బులు లేవన్న రైతులతో గుంజీలు తీయించారు. సమీపంలో ఓ ఇంటికి అమర్చిన సీసీటీవీ కెమెరాకు ఈ దృశ్యాలు చిక్కడంతో ఆదివారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. దీనిపై తహసీల్దార్‌ను మీడియా ప్రశ్నించగా తాను కేవలం మందలించానని, వారే క్షమించమని గుంజీలు తీశారని చెప్పారు.

ఈ ఘటనపై అనుగుల్‌కలెక్టర్‌ సిద్ధార్థ్‌ శంకర్‌ స్వయ్‌ స్పందిస్తూ దర్యాప్తు చేయాలని ఆటమల్లిక్‌ ఉప కలెక్టర్‌కు ఆదేశించారు. మరోవైపు రైతులు స్థానిక ఠాణాలో ఫిర్యాదు చేశారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

తర్వాతి కథనం
Show comments