Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశవ్యాప్తంగా 82 జిల్లాల్లో కొవిద్-19 పై సర్వే

Webdunia
సోమవారం, 20 ఏప్రియల్ 2020 (17:53 IST)
కరోనా వైరస్‌పై మరింత అవగాహనకై దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్న 82 జిల్లాల్లో ఐసిఎంఆర్ ఆధ్వర్యంలో నేషనల్ సీరో-సర్వే ను నిర్వహించడం జరుగుతుందని భారత వైద్య పరిశోధనా మండలి డైరెక్టర్ జనరల్ ప్రొ.బలరాం భార్గవ చెప్పారు.

ఈ మేరకు సోమవారం ఆయన ఢిల్లీ నుండి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రొ.భార్గవ మాట్లాడుతూ కరోనా ఎక్కువగా ప్రబలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మరింత విస్తృత అవగాహన కోసమే ఐసిఎంఆర్ ఆధ్వర్యంలో ఈనేషనల్ సీరో సర్వేను నిర్వహించడం జరుగుతోందని పేర్కొన్నారు.

ఇప్పటికే దేశ వ్యాప్తంగా 82 జిల్లాలను ఈసర్వేకు ఎంపిక చేయగా ప్రతి జిల్లాలో ఒక్కరోజులోనే సర్వేను పూర్తి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.10 రోజుల్లో ఈ చిన్నపాటి సర్వేను పూర్తి చేయడం జరుగుతుందని ఐసిఎంఆర్ డిజి బలరాం భార్గవ స్పష్టం చేశారు.

సర్వే నిర్వహణకు జిల్లాలకు వచ్చిన ఐసిఎంర్ సర్వే బృందాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేలా చూడాలని ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను డిజి బలరాం భార్గవ కోరారు.

వీడియో సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, సిఎం అదనపు సిఎస్ డా.పివి.రమేశ్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గేమ్ ఛేంజర్ నష్టాలను రామ్ చరణ్ రికవరీ చేస్తున్నాడా?

రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ గా సంహారం

నా లైఫ్‌లో తండేల్ అల్లు అరవింద్ గారే : అక్కినేని నాగచైతన్య

అంత ఫాస్ట్‌గా డ్యాన్స్ చేయకండి బాబూ... మహేష్, ప్రభాస్, చెర్రీని అడుక్కున్న షారూఖ్

ఇక్కడ ఫస్ట్ షూటింగ్ చేసేది నా సినిమానే: మెగాస్టార్ చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలం సీజనల్ వ్యాధులను అడ్డుకునే ఆహారం ఏమిటి?

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ పర్యటన: తాజా ఫ్యాషన్ ప్రపంచంలోకి ద వన్ అండ్ వోన్లీ

ఆఫ్రికా హృదయం నుండి ఆయుర్వేద జ్ఞానం వరకు: మరువా x సరితా హండా

లవంగం పాలు తాగితే ఈ సమస్యలన్నీ పరార్

భారతదేశంలో విక్టోరియా సీక్రెట్ 11వ స్టోర్‌ను ప్రారంభించిన అపెరల్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments