Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ గ్రామంలో 'ద్రౌపది' సంప్రదాయం.. ఒక స్త్రీ ఎంతమందినైనా పెళ్లాడవచ్చు... ఎక్కడ?

Webdunia
సోమవారం, 5 డిశెంబరు 2022 (10:53 IST)
మహాభారతంలో పాంచాలి (ద్రౌపది) ఐదుగురు భర్తలకు భార్య. ఇలాంటి ఉదాహరణలు మన దేశ చరిత్రలో అనేకం ఉన్నాయి. ముఖ్యంగా, ఒక స్త్రీ ఎంతమంది పురుషులనైనా పెళ్లాడవచ్చు. వారితో సఖ్యతగా సంసార జీవితాన్ని గడవచ్చు. ఇలాంటి ఆచారం హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని పలు గిరిజన గ్రామాల్లో నేటికీ కొనసాగుతోంది. 
 
తాజాగా హిమాచల్ ప్రదేశ్ కిన్నౌర్ జిల్లాలోని పలు గిరిజన గ్రామాల్లోని మహిళలు ఒకే ఇంటిలోని ఐదుగురు లేదా ఏడుగురు సోదరులను వివాహం చేసుకునే అవకాశం ఉంది. వీరంతా కలిసి మహాభారతంలోని పంచపాండవులా కలిసిమెలిసి హాయిగా జీవిస్తున్నారు. 
 
ఈ గిరిజన గ్రామాల్లో పాండవులు వనవాసం చేశారని ఈ ప్రాంత వాసులు బలంగా నమ్ముతారు. అందుకే తమ ఇంటిలోని అమ్మాయికి వివాహం నిశ్చయించినపుడు వరుడు కుటుంబంలోని అబ్బాయిలందరి గురించి సమాచారం తెలుసుకుంటారు. తర్వాత తమ అమ్మాయికి ఆ సోదరులందరితో వివాహం చేస్తారు. 
 
పెళ్లి అయ్యాక ఒక సోదరుడు వధువుతో గదిలో ఉంటే అతను తన టోపీని తలుపు వద్ద ఉంచుతాడు. మిగిలిన సోదరులు ఈ సంప్రదాయాన్ని గౌరవిస్తారు. తలుపు వద్ద టోపీ ఉంచినపుడు ఇతర సోదరులు ఎవరూ గదిలోకి ప్రవేశించరు. ఈ పద్ధతి కారణంగా వారి వైవాహిక జీవితంపై అనవసరమైన ఒత్తిడి ఏర్పడదు. ఈ సంప్రదాయం కారణంగా కుటుంబ ఆస్తి కూడా విభజనకు దారితీయదు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments