Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడి మోజులోపడి స్నేహితుడి ద్వారా భర్తకు సైనైడ్ ఇచ్చిన భార్య...

Webdunia
సోమవారం, 5 డిశెంబరు 2022 (10:31 IST)
దేశంలో వివాహేతర సంబంధాల కారణంగా జరుగతున్న హత్యల సంఖ్య నానాటికీ పెరిగిపోతున్నాయి. తాజాగా గుజరాత్ రాష్ట్రంలో ఓ వివాహిత ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తకు సైనైడ్ ఇచ్చి హతమార్చింది. తాజాగా వెలుగు చూసిన ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
గుజరాత్, జునాఘడ్ పట్టణానికి చెందిన రఫీక్, మొహమూదాలు అనే భార్య భర్తలు ఉన్నారు. అయితే, మొహమదాలుకూ ఆసిఫ్ చౌహాన్ అనే వ్యక్తితో గత కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రియుడిపై చచ్చేటంత ప్రాణం పెట్టుకున్న మొహమదాలు ప్రియుడిని పెళ్లాడాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం భర్త అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేసి, తన మనస్సులోని ఆలోచనను ప్రియుడు ఆసిఫ్‌కు చెప్పింది. దానికి అతను కూడా సమ్మతించి, తన స్నేహితుడు ఇమ్రాన్ సాయం తీసుకున్నాడు. 
 
తమ పథకంలో భాగంగా ఇమ్రాన్‌తో సైనైడ్ తెప్పించి భర్త రఫీక్‌తో పాటు అతని స్నేహితుడు భరత్‌కు సైనైడ్ కలిపిన శీతలపానీయం ఇచ్చింది. ఈ కూల్‌డ్రింక్స్ సేవించగానే రఫీక్, భరత్‌లు స్పృహతప్పి పడిపోయారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. ఆ తర్వాత జరిపిన శవపరీక్షలో వారు తాగిన శీతలపానీయంలో విషం ఉన్నట్టు తేలింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా అసలు విషయం వెల్లడైంది. దీంతో హత్యకు కారణమైన మొహమూదా, ఆసిఫ్, ఇమ్రాన్‌లను అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments