Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైబర్ నేరగాళ్ల పంజా.. సుప్రీం కోర్టు యూట్యూబ్ హ్యాక్!!

సెల్వి
శనివారం, 21 సెప్టెంబరు 2024 (09:53 IST)
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు చెందిన యూట్యూబ్ ఛానెల్ శుక్రవారం హ్యాక్ అయ్యింది. అమెరికా ఆధారిత కంపెనీ Ripple Labs అభివృద్ధి చేసిన క్రిప్టోకరెన్సీని ప్రచారం చేసే వీడియోలను చూపుతోంది. సుప్రీంకోర్టు అఫీషియల్ యూట్యూబ్ ఛానెల్‌లో క్రిప్టో కరెన్సీని ప్రమోట్‌ చేస్తున్నట్లుగా ఉన్న వీడియోలు కనిపించడంతో అది చూసిన వారంతా షాక్ అయ్యారు.
 
దీంతో భారత సర్వోన్నత న్యాయస్థానం యూట్యూబ్ ఛానెల్‌ను తొలగించడం జరిగింది. భారత సుప్రీంకోర్టు యూట్యూబ్ ఛానెల్‌లోని సేవలు త్వరలో పునరుద్ధరించబడతాయని సుప్రీం కోర్టు వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసిన నోటీసులో పేర్కొంది. 
 
రాజ్యాంగ బెంచ్‌ల ముందు జాబితా చేయబడిన కేసులు, ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన విషయాలను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి సుప్రీం కోర్టు యూట్యూబ్‌ను ఉపయోగిస్తోంది. ఇకపోతే ఇటీవలే హైదరాబాద్‌ మెట్రో రైల్ కార్పొరేషన్‌కు చెందిన ట్విట్టర్ అకౌంట్‌ హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు.. అందులో క్రిప్టోకరెన్సీకి సంబంధించిన యాడ్‌ను పోస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

Pawan: పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు ట్రైలర్ కు డేట్ ఫిక్స్

అలాంటి తల్లిదండ్రులకి ఒక గుణపాఠం కావాలి : హీరో శివాజీ

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments