Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెప్టెంబరు 12నే నీట్ ప్రవేశ పరీక్షలు : పిటిషన్లను తిరస్కరించిన సుప్రీం

Webdunia
సోమవారం, 6 సెప్టెంబరు 2021 (15:11 IST)
జాతీయ స్థాయిలో వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)ను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ నెల 12వ తేదీన ఈ పరీక్షలను నిర్వహించేలా కేంద్రం నోటిఫికేషన్ జారీచేసింది. 
 
అయితే సెప్టెంబరు 12న మరికొన్ని పోటీ పరీక్షలు ఉన్నాయని, సీబీఎస్ఈ పరీక్షలు కూడా ఉన్నాయని అందువల్ల ఈ పరీక్షలను వాయిదావేయాలని పలువురు విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. 
 
వీటిపై కోర్టు స్పందిస్తూ, నీట్ పరీక్ష యధాతథంగా సెప్టెంబరు 12నే జరుగుతుందని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా 16 లక్షల మంది నీట్ రాస్తున్నారని, విద్యావ్యవస్థలపై తాము జోక్యం చేసుకుంటే ఆ ప్రభావం లక్షల మందిపై పడుతుందని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది.
 
అయినా ఏ కొందరి కోసమో నీట్ వాయిదా వేయడం సబబు కాదని అభిప్రాయపడింది. అందుకే ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించడం లేదని స్పష్టం చేసింది. ఒకేరోజున అనేక పరీక్షలు ఉన్నాయని పిటిషనర్లు అంటున్నారని, అలాంటప్పుడు ఏదో ఒకటే ఎంచుకోవడం మేలని సూచించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments