Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నికల్లో ఈవీఎంలను నిషేధించాలన్న పిటిషన్‌ను తోసేసిన సుప్రీం

Webdunia
మంగళవారం, 6 సెప్టెంబరు 2022 (12:54 IST)
దేశంలో జరిగే ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు (ఈవీఎం)లను వినియోగించకుండా నిషేధం విధించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు సర్వోన్నత న్యాయస్థానం ససేమిరాంది. సీనియర్ న్యాయవాది జయ సుకిన దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించకుండానే తోసిపుచ్చింది. 
 
వచ్చే 2024లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ పేపర్లను వినియోగించేలా భారత ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని సుకిన్ తన పిటిషన్‌లో కోరారు. 
 
ముఖ్యంగా, జర్మనీ, అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, నెదర్లాండ్స్ వంటి పలు దేశాల్లో ఈవీఎంలను పక్కనబెట్టేసి బ్యాలెట్ పత్రాలతోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారని ఆయన గుర్తుచేశారు. 
 
అదేసమయంలో దేశంలో ప్రజాస్వామ్యాన్ని పాదుగొల్పేలా ఎన్నికల ప్రక్రియలో బ్యాలెట్ పేపర్ల విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని ఆయన కోరారు. అయితే, ఈ పిటిషన్ జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన అపెక్స్ ధర్మాసనం, విచారణకు స్వీకరించకుండానే తోసిపుచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: వార్ 2తో హృతిక్ రోషన్ తారక్ (ఎన్.టి.ఆర్.) 25 ఏళ్ళ వారసత్వం

Raashi Khanna: ఉస్తాద్‌ భగత్‌సింగ్ లో దేవదూత రాశిఖన్నా శ్లోకా గా ఎంట్రీ

పవన్ కళ్యాణ్ నిత్యం మండే స్ఫూర్తి : క్రిష్ జాగర్లమూడి

Bigg Boss 9 Telugu: సెట్లు సిద్ధం.. వీజే సన్నీ, మానస్, ప్రియాంక జైన్‌లు రీ ఎంట్రీ

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments