సినీ నటుడు బాలకృష్ణకు సుప్రీంకోర్టు నోటీసులు!

Webdunia
సోమవారం, 29 ఆగస్టు 2022 (20:03 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణకు సుప్రీంకోర్టు సోమవారం నోటీసులు జారీచేసింది. అలాగే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణ ప్రభుత్వానికి కూడా నోటీసులు జారీచేసింద. గతంలో బాలకృష్ణ నటించి గౌతమీపుత్ర శాతకర్ణ, అనుష్క ప్రధాన పాత్రలో వచ్చిన రుద్రమదేవి చిత్రాలకు ఈ రెండు ప్రభుత్వాలు వినోదపు పన్ను రాయితీ కల్పించాయి. కానీ టిక్కెట్ రేట్లు మాత్రం తగ్గించలేదని, అందువల్ల పన్నురాయితీ పొందిన మేరకు డబ్బును తిరిగి వసూలు చేయాలని పేర్కొంటూ వినియోగదారుల ఫోరం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 
 
గౌతమీపుత్ర శాతకర్ణికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రుద్రమదేవికి తెలంగాణ ప్రభుత్వం పన్ను రాయితీని ఇచ్చాయని, కానీ, ఆ చిత్రాల నిర్మాతలు పన్ను రాయితీ ప్రయోజనాలను ప్రేక్షకులకు వర్తింపజేయలేదని ఆరోపించారు. 
 
ఈ పిటిషన్‌ను డీవై చంద్రచూడ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు ఆలకించిన తర్వాత బాలకృష్ణకు, ఆయా చిత్రాల నిర్మాతలకు, ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల నుంచి వివరణ కోరింది. తమ నోటీసులపై నాలుగు వారాల్లోగా స్పందించాలని ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం