Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీట్ పీజీ అడ్మిషన్లకు అనుమతి ఇచ్చిన సుప్రీంకోర్టు

Webdunia
శుక్రవారం, 7 జనవరి 2022 (13:26 IST)
దేశ వ్యాప్తంగా నీట్ పీజీ అడ్మిషన్లకు సుప్రీంకోర్టు శుక్రవారం అనుమతి ఇచ్చింది. 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లు చేపట్టవచ్చని జస్టిస్ డీవై చంద్రచూడ్, ఏఎస్. బొపన్నలతో కూడిన ధర్మాసనం కీలక ఆదేశాలు జారీచేసింది. అలాగే, నీట్ పీజీ ప్రవేశాలకు సంబంధించి రిజర్వేషన్ కోటాను కూడా ఫిక్స్ చేసింది. ఓబీసీలకు 27 శాతం, ఆర్థిక బలహీన వర్గాలకు 10 శాతం చొప్పున రిజర్వేషన్లు కల్పించేందుకు పచ్చజెండా ఊపింది. దీంతో పీజీ కౌన్సెలింగ్‌పై నెలకొన్న ప్రతిష్టంభనకు తెరబడింది. 
 
అదేసమయంలో ఆయా రాష్ట్రాల వైద్య కాలేజీల్లో అఖిల భారత కోటాలోని సీట్ల భర్తీలో పాత రిజర్వేషన్ విధానం వర్తిస్తుందని తెల్పింది. కాగా, నీట్ పీజీ కోటాపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలంటూ ఇటీవల రెసిడెంట్ వైద్యులు ఆందోళన చేశారు. అలాగే, ఒక రోజు వైద్య సేవలను కూడా బంద్ చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు నీట్ పీజీ ప్రవేశాలకు అనుమతి ఇచ్చింది. కాగా, ఈడబ్ల్యూఎస్ కోటాలో సీటు పొందేవారికి వార్షిక ఆదాయం రూ.8 లక్షల మేరకు ఉండాలన్న నిబంధన కూడా ఈ యేడాది వర్తించనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పట్టణంలో కొత్త రాబిన్‌హుడ్ వచ్చింది ఓటీటీలోకి హరి హర వీర మల్లు

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments