Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీట్ పీజీ అడ్మిషన్లకు అనుమతి ఇచ్చిన సుప్రీంకోర్టు

Webdunia
శుక్రవారం, 7 జనవరి 2022 (13:26 IST)
దేశ వ్యాప్తంగా నీట్ పీజీ అడ్మిషన్లకు సుప్రీంకోర్టు శుక్రవారం అనుమతి ఇచ్చింది. 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లు చేపట్టవచ్చని జస్టిస్ డీవై చంద్రచూడ్, ఏఎస్. బొపన్నలతో కూడిన ధర్మాసనం కీలక ఆదేశాలు జారీచేసింది. అలాగే, నీట్ పీజీ ప్రవేశాలకు సంబంధించి రిజర్వేషన్ కోటాను కూడా ఫిక్స్ చేసింది. ఓబీసీలకు 27 శాతం, ఆర్థిక బలహీన వర్గాలకు 10 శాతం చొప్పున రిజర్వేషన్లు కల్పించేందుకు పచ్చజెండా ఊపింది. దీంతో పీజీ కౌన్సెలింగ్‌పై నెలకొన్న ప్రతిష్టంభనకు తెరబడింది. 
 
అదేసమయంలో ఆయా రాష్ట్రాల వైద్య కాలేజీల్లో అఖిల భారత కోటాలోని సీట్ల భర్తీలో పాత రిజర్వేషన్ విధానం వర్తిస్తుందని తెల్పింది. కాగా, నీట్ పీజీ కోటాపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలంటూ ఇటీవల రెసిడెంట్ వైద్యులు ఆందోళన చేశారు. అలాగే, ఒక రోజు వైద్య సేవలను కూడా బంద్ చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు నీట్ పీజీ ప్రవేశాలకు అనుమతి ఇచ్చింది. కాగా, ఈడబ్ల్యూఎస్ కోటాలో సీటు పొందేవారికి వార్షిక ఆదాయం రూ.8 లక్షల మేరకు ఉండాలన్న నిబంధన కూడా ఈ యేడాది వర్తించనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వంత్ నటించిన సస్పెన్స్ చిత్రం హైడ్ న్ సిక్ ఎలా వుందంటే.. మూవీ రివ్యూ

'దేవర' చిత్రానికి బిజినెస్ జరగలేదా? ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరాశ!

మ్యాడ్ స్క్వేర్ నుంచి లడ్డు గాని పెళ్లి గీతం విడుదల

అక్కినేని నాగేశ్వరరావు ప్రయాణం ప్రతి ఒక్కరికి ప్రేరణ : నందమూరి బాలకృష్ణ

ఏయన్నార్ కృషి - కీర్తి - స్పూర్తి ప్రతి నటునికి మార్గదర్శకం : బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి ఆకులతో మధుమేహం పరార్.. ఇవి తెలిస్తే?

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

తర్వాతి కథనం
Show comments