Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలాంటి ఖైదీలంతా 15 రోజుల్లో లొంగిపోవాలి : సుప్రీంకోర్టు

Webdunia
శుక్రవారం, 24 మార్చి 2023 (19:07 IST)
కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉన్న సమయంలో జైళ్లలో రద్దీని తగ్గించేందుకు వివిధ నేరాల్లో శిక్షను అనుభవిస్తున్న దోషులు, విచారణ ఖైదీలను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే, వారందరూ 15 రోజుల్లోపు సంబంధిత జైలు అధికారుల ముందు లొంగిపోవాలని సుప్రీం కోర్టు శుక్రవారం ఆదేశించింది. మహమ్మారి సమయంలో అత్యవసర, మధ్యంతర బెయిళ్లపై విడుదలైనవారు ఈ మేరకు లొంగిపోవాలని జస్టిస్‌ ఎంఆర్ షా, జస్టిస్‌ సీటీ రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
 
లొంగిపోయిన అనంతరం విచారణ ఖైదీలు.. రెగ్యులర్‌ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ధర్మాసనం తెలిపింది. అదేవిధంగా దోషులు సైతం లొంగిపోయిన తర్వాత.. తమ శిక్షను రద్దు చేయాలని కోరుతూ, చట్టాలకు లోబడి న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చని చెప్పింది. 
 
మరోవైపు, కరోనా తీవ్రత దృష్ట్యా సుప్రీం ఆదేశాలకు అనుగుణంగా ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ సిఫార్సుల మేరకు.. వివిధ రాష్ట్రాల్లో స్వల్ప తీవ్రత కలిగిన నేరాలకు పాల్పడిన అనేక మంది నేరస్థులు, విచారణ ఖైదీలను విడుదల చేశారు. తాజాగా వారందరూ లొంగిపోవాలంటూ సర్వోన్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments