కొందరి కోసం ఇతరుల జీవించే హక్కును హరిస్తారా? సుప్రీంకోర్టు

Webdunia
బుధవారం, 29 సెప్టెంబరు 2021 (14:18 IST)
దీపావళి పండుగ సమయంలో బాణసంచా పేల్చడాన్ని ఈ యేడాది ఢిల్లీ ప్రభుత్వం నిషేధించింది. ఈ వ్యవహారం ఇపుడు సుప్రీంకోర్టుకు చేరింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 
 
టపాసుల పేల్చడంపై విధించిన నిషేధించాలని తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను బుధవారం జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ ఎ.ఎస్. బోపన్నల ధర్మాసనం విచారించింది. కొందరికి ఉపాధి దొరుకుతుందని ఇతరుల జీవించే హక్కులను హరించడం మంచిదికాదని వ్యాఖ్యానించింది. అమాయకుల జీవించే హక్కును పరిరక్షించడమే తమ విధి అని పేర్కొంది.
 
బాణసంచా తయారీదారుల సంఘం కూడా తన వాదనలను వినిపించింది. దీపావళి పండుగ దగ్గరకొస్తోందని, టపాసుల విషయంలో పెట్రోలియం, పేలుడు పదార్థాల భద్రత సంస్థ త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరింది. ప్రస్తుతం లక్షల మంది ఉపాధి లేకుండా ఉన్నారని పేర్కొంది. 
 
అయితే, పర్యావరణానికి హాని చేయని టపాసులుంటే చెప్పాలని, వాటికి నిపుణుల కమిటీ ఆమోదం తెలిపితే అందుకు అనుగుణంగా ఆదేశాలిస్తామని తెలిపింది. దేశంలో చట్టాలున్నా వాటి అమలు కష్టతరమవుతోందని వ్యాఖ్యానించింది. కొందరు ఉపాధి కోసం ఇతరుల హక్కులను కాలరాయలేమన్న సుప్రీంకోర్టు.. తదుపరి విచారణను వాయిదా వేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments