Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైబర్ నేరగాళ్ల పంజా.. సుప్రీం కోర్టు యూట్యూబ్ హ్యాక్!!

సెల్వి
శనివారం, 21 సెప్టెంబరు 2024 (09:53 IST)
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు చెందిన యూట్యూబ్ ఛానెల్ శుక్రవారం హ్యాక్ అయ్యింది. అమెరికా ఆధారిత కంపెనీ Ripple Labs అభివృద్ధి చేసిన క్రిప్టోకరెన్సీని ప్రచారం చేసే వీడియోలను చూపుతోంది. సుప్రీంకోర్టు అఫీషియల్ యూట్యూబ్ ఛానెల్‌లో క్రిప్టో కరెన్సీని ప్రమోట్‌ చేస్తున్నట్లుగా ఉన్న వీడియోలు కనిపించడంతో అది చూసిన వారంతా షాక్ అయ్యారు.
 
దీంతో భారత సర్వోన్నత న్యాయస్థానం యూట్యూబ్ ఛానెల్‌ను తొలగించడం జరిగింది. భారత సుప్రీంకోర్టు యూట్యూబ్ ఛానెల్‌లోని సేవలు త్వరలో పునరుద్ధరించబడతాయని సుప్రీం కోర్టు వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసిన నోటీసులో పేర్కొంది. 
 
రాజ్యాంగ బెంచ్‌ల ముందు జాబితా చేయబడిన కేసులు, ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన విషయాలను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి సుప్రీం కోర్టు యూట్యూబ్‌ను ఉపయోగిస్తోంది. ఇకపోతే ఇటీవలే హైదరాబాద్‌ మెట్రో రైల్ కార్పొరేషన్‌కు చెందిన ట్విట్టర్ అకౌంట్‌ హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు.. అందులో క్రిప్టోకరెన్సీకి సంబంధించిన యాడ్‌ను పోస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments