Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుడమికి చేరిన సునీతా విలియమ్స్... ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలేంటి?

ఠాగూర్
గురువారం, 20 మార్చి 2025 (13:09 IST)
వారంరోజుల ప్రయోగం కోసం అంతరిక్ష పరిశోధనా కేంద్రా(ఐఎస్ఎస్)నికి వెళ్లిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ అనివార్య కారణాలతో అక్కడే తొమ్మిది నెలల పాటు ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సునీతా విలియమ్స్‌‍తో సహా ఇతర వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లిన స్టార్ క్యాప్సూల్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఆమె అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో తాజాగా ఆమె భూమికి చేరుకున్నారు. 
 
అయితే, అంతరిక్షంలో సుధీర్ఘకాలం ఉండి భూమికి చేరుకున్న సునీతా విలియమ్స్ భూవాతావరణానికి అలవాటుపడటానికి కొంత సమయం పడుతుంది. ఎందుకంటే అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి ఉండదు. కాబట్టి శరీరం తేలికగా మారుతుంది. సునీత అంతరిక్షంలో ఎక్కువ కాలం గడపడం వల్ల ఆమె ఎముకలు పెళుసుబారి, కండరాలు క్షీణించివుంటాయి. 
 
రేడియేషన్ కారణంగా దృష్టిలోపం వంటి సమస్యలు ఉత్పన్నంకావొచ్చు. రక్తప్రసరణలో తేడా వస్తుంది. రక్తం గడ్డకట్టే ప్రమాదం లేకపోలేదు. ఈ సమయంలో ఆమె వైద్యుల పర్యవేక్షణలో సరైన జాగ్రత్తలు తీసుకుని మళ్లీ భూవాతావరణానికి అలవాటు పడాలంటే కనీసం ఒక నెల రోజులైనా సమయం పడుతుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments