Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా మహమ్మారిని బయటపడిన ఎంపీ సుమలత

Webdunia
మంగళవారం, 4 ఆగస్టు 2020 (16:43 IST)
ప్రముఖ సినీ నటి, లోక్‌సభ సభ్యురాలు సుమలత కరోనా వైరస్ మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇపుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు ఆమె ప్రకటించారు. అయితే కరోనా మహమ్మారిని ఎలా ఎదుర్కొన్నారంటూ తనను చాలామంది మిత్రులు, ఇతరులు అడుగుతున్నారని సుమలత వెల్లడించారు. 
 
కరోనా చికిత్సలో మీరు ఎదుర్కొన్న అనుభవాలేంటి? మీ పోరాటం ఎలా సాగింది? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారని, అలాంటివారందరి కోసం రేపు ఇన్ స్టాగ్రామ్ లైవ్‌లో పాల్గొంటున్నట్టు వివరించారు. 
 
బుధవారం సాయంత్రం 5.30 గంటలకు డాక్టర్ చైత్ర సాయంతో అందరి సందేహాలు నివృత్తి చేస్తానని సుమలత వెల్లడించారు. తన కరోనా అనుభవాలు ఏ కొందరికైనా ఉపయోగపడితే అదే చాలని ఆమె తెలిపారు.
 
కాగా, భర్త అంబరీష్ చనిపోయిన తర్వాత సుమలత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత మాండ్యా లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుత లోక్‌సభలో ఆమె కర్నాటక రాష్ట్రంలోని మాండ్య స్థానం ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments