Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసక్తికర విషయాన్ని వెల్లడించిన సుధా నారాయణ మూర్తి.. కలాం ఫోన్ చేస్తే రాంగ్ నంబర్ అని చెప్పా...

వరుణ్
బుధవారం, 26 జూన్ 2024 (10:53 IST)
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సతీమణి సుధా నారాయణ మూర్తి తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం నుంచి ఒకసారి తనకు ఫోన్ కాల్ వచ్చిందని, తాను రాసిన కాలమ్స్ చదివి ఆస్వాదించానంటూ ఆయన చెప్పారని సుధామూర్తి పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా మంగళవారం ఆమె ఒక ఆడియో క్లిప్‌ను షేర్ చేశారు. ఇందులో అబ్దుల్ కలామ్ నుంచి ఫోన్ వచ్చినప్పుడు ఏం జరిగిందో ఓ సందర్భంలో చెప్పిన విషయాలు ఉన్నాయి. 
 
రాష్ట్రపతి భవన్ నుంచి ఫోన్ కాల్ వస్తే 'రాంగ్ కాల్' అని (ఆపరేటర్‌కి) తాను సమాధానం ఇచ్చానని సుధామూర్తి వెల్లడించారు. తన భర్త నారాయణ మూర్తికి చేయబోయి తనకు చేశారేమో అనుకున్నానని, అందుకే రాంగ్ అని కాల్ చెప్పినట్టు ఆమె పేర్కొన్నారు. అయితే 'అబ్దుల్ కలాం ప్రత్యేకంగా మీ పేరే చెప్పారు' అనడంతో తాను ఆందోళనతో పాటు ఆశ్చర్యపోయానని, ఏం చేశానని కాల్ చేస్తున్నారో అర్థం కాలేదని గుర్తుచేసుకున్నారు. అయితే 'ఐటీ డివైడ్' పేరిట తాను రాసిన కాలమ్‌ను చదివి ప్రశంసించడానికి అబ్దుల్ కలాం ఫోన్ చేశారని, చాలా బావుందంటూ తనను మెచ్చుకున్నారని సుధామూర్తి ప్రస్తావించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments