Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖరగ్‌పూర్ ఐఐటీలో అనుమానాస్పద మరణాలు.. 4 రోజుల్లో రెండో మృతి

ఠాగూర్
మంగళవారం, 22 జులై 2025 (15:05 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని ఖరగ్‌పూర్ ఐఐటీలో విద్యార్థులు అనుమానాస్పదంగా చనిపోతున్నారు. గత నాలుగు రోజుల్లో రెండు మరణాలు సంభవించాయి. సోమవారం రాత్రి ఓ విద్యార్థి చనిపోయాడు. ద్వితీయ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విద్యాభ్యాసం చేస్తున్న చంద్రదీప్ పవార్ ఐఐటీ క్యాంపస్‌లో అనుమానాస్పదంగా చనిపోయాడు. కాగా, ఈ నెల 18వ తేదీన మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థి రితం మండల్ మృతదేహం హాస్టల్ గదిలో అనుమానాస్పదస్థితిలో కనిపించిన విషయం తెల్సిందే.
 
కాగా, సోమవారం రాత్రి భోజనం చేసిన తర్వాత చంద్రదీప్ వైద్యుడి సలహా మేరకు ఏదో మెడిసిన్ వాడినట్టు పోలీసులకు విద్యాసంస్థ అధికారులు సమాచారం చేరవేశారు. ఆ విద్యార్థి తీసుకున్న టాబ్లెట్ శ్వాసనాళంలో ఇరుక్కుపోయి చివరికి అతని మరణానికి కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 
 
మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చంద్రదీప్‌ను తొలుత ఐఐటీ క్యాంపస్ ఆస్పత్రికి తరలించారు. అయితే, అక్కడి వైద్యులు అప్పటికే అతడు చనిపోయినట్టు ప్రకటించారు. విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపారు. అతని మరణానికి అసలు కారణం శవపరీక్ష నివేదిక వచ్చిన తర్వాతే తెలుస్తుందని అధికారులు వెల్లడించారు. మరోవైపు, ఈ మృతిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఉస్తాద్ భగత్ సింగ్'లో రాశీఖన్నా... మేకర్స్ వెల్లడి

NTR: వార్ 2తో హృతిక్ రోషన్ తారక్ (ఎన్.టి.ఆర్.) 25 ఏళ్ళ వారసత్వం

Raashi Khanna: ఉస్తాద్‌ భగత్‌సింగ్ లో దేవదూత రాశిఖన్నా శ్లోకా గా ఎంట్రీ

పవన్ కళ్యాణ్ నిత్యం మండే స్ఫూర్తి : క్రిష్ జాగర్లమూడి

Bigg Boss 9 Telugu: సెట్లు సిద్ధం.. వీజే సన్నీ, మానస్, ప్రియాంక జైన్‌లు రీ ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments