Webdunia - Bharat's app for daily news and videos

Install App

డెలివరీ ఏజెంట్‌గా వచ్చి అత్యాచారం చేశాడంటూ పూణే టెక్కీ ఫిర్యాదు

ఠాగూర్
మంగళవారం, 22 జులై 2025 (14:50 IST)
మహారాష్ట్రలోని పూణే నగరానికి చెందిన ఓ టెక్కీ.. డెలివరీ ఏజెంట్‌పై అసత్య ప్రచారం చేసింది. డెలివరీ ఏజెంట్‌గా నటిస్తూ వచ్చి తనపై అత్యాచారం చేశాడని ఆరోపించింది. దీనిపై పోలీసులు విచారణ జరుపగా అబద్ధం అని తేలింది. 
 
ఈ నెల 3వ తేదీన 22 యేళ్ళ యవసున్న ఓ టెక్కీ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. అందులో డెలివరీ ఏజెంట్‌గా వచ్చిన ఒక వ్యక్తి తన ఫ్లాట్‌లోకి చొరబడి తనపై అత్యాచారం చేశాడని ఆరోపించింది. అంతేకాకుండా, ఆ తర్వాత తాను స్పృహ కోల్పోయేలా చేశాడని తెలిపింది. 
 
సదరు వ్యక్తి తన ఫోటోలు తీశాడని, ఈ విషయం బయటకు చెబితే సామాజిక మాధ్యమాలలో పోస్టు చేస్తానని బెదిరించాడని పోలీసులకు వివరించింది. తన ఆరోపణలకు మద్దతుగా సాక్ష్యాలను కూడా సమర్పించింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టగా, ఇదంతా అబద్ధమని తేలింది. 
 
డెలివరీ ఏజెంట్‌గా వచ్చిన వ్యక్తి ఆమె స్నేహితుడుగా గుర్తించారు. ఆమెపై ఎలాంటి అఘాయిత్యం జరగలేదని, కావాలనే పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేసిందని విచారణలో వెల్లడైంది. దీంతో పోలీసులు ఆమెపైనే కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఉస్తాద్ భగత్ సింగ్'లో రాశీఖన్నా... మేకర్స్ వెల్లడి

NTR: వార్ 2తో హృతిక్ రోషన్ తారక్ (ఎన్.టి.ఆర్.) 25 ఏళ్ళ వారసత్వం

Raashi Khanna: ఉస్తాద్‌ భగత్‌సింగ్ లో దేవదూత రాశిఖన్నా శ్లోకా గా ఎంట్రీ

పవన్ కళ్యాణ్ నిత్యం మండే స్ఫూర్తి : క్రిష్ జాగర్లమూడి

Bigg Boss 9 Telugu: సెట్లు సిద్ధం.. వీజే సన్నీ, మానస్, ప్రియాంక జైన్‌లు రీ ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments