Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశ రాజధానిని వణికించిన భూకంపం.. ప్రజలు రోడ్లపైకి పరుగో పరుగు

ఠాగూర్
గురువారం, 10 జులై 2025 (10:14 IST)
దేశ రాజధాని ఢిల్లీని భూకంపం వణికించింది. ఢిల్లీతో పాటు దాని పరిసర ప్రాంతాల్లో గురువారం ఉదయం బలమైన భూప్రకంపనలు సంభవించాయి. కొన్ని సెకన్ల పాటు భూమి బలంగా కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. నివాసాలు, కార్యాలయాల్లో ఉన్నవారు ఏ జరుగుతుందో తెలియక ఆందోళనతో బయటకు పరుగులు తీశారు. 
 
ఈ భూకంపం కేంద్రం హర్యానాలోని రేవారి జిల్లాలో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. రేవారి జిల్లా పరిధిలోని గురవార అనే ప్రాంతం సమీపంలో భూకంపం సంభవించినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు.
 
భూకంప కేంద్రం హర్యానాలో ఉన్నప్పటికీ దాని ప్రభావం మాత్రం ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, ఘజియాబాద్ వంటి జాతీయ రాజధాని ప్రాంతం అంతటా స్పష్టంగా కనిపించింది. ఈ భూకంపం ప్రభావం వల్ల సంభవించిన ఆస్తి, ప్రాణనష్టం వివరాలు ఇంకా తెలియాల్సివుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

తర్వాతి కథనం
Show comments