Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరోమారు వందే భారత్ రైలుపై రాళ్లదాడి..

Webdunia
మంగళవారం, 2 మే 2023 (14:17 IST)
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి దేశంలోని వివిధ మార్గాల్లో నడుపుతున్న వందే భారత్ రైళ్లపై కొందరు అకతాయిలు రాళ్లతో దాడులు చేస్తున్నారు. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో మొదలైన ఈ రాళ్ళ దాడి.. ఆ తర్వాత ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించింది. ఇటీవల సికింద్రాబాద్ - విశాఖపట్టణం ప్రాంతాల మధ్య నడిచే వందే భారత్ రైలుపై దాడి జరిగింది. తాజాగా కేరళ రాష్ట్రంలో కూడా ఈ దాడి జరిగింది. 
 
కాసర్‌కోడ్ నుంచి తిరువనంతపురం ప్రాంతాల మధ్య నడిచే వందే భారత్ రైలుపై తిరునవాయి - తిరూర్ ప్రాంతాల మధ్య కొందరు అకతాయిలు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఓ కోచ్‌కు చెందిన అద్దాలు స్వల్పంగా పగిలిపోయాయి. ఈ దాడి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. కాగా, ఈ రైలును ప్రధానమంత్రి నరకేంద్ర మోడీ గత నెల 25వ తేదీన ప్రారంభించారు. తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్‌ నుంచి ఈ రైలు బయలుదేరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

నేటి ట్రెండ్ కు తగ్గట్టు కంటెంట్ సినిమాలు రావాలి : డా: రాజేంద్ర ప్రసాద్

దుబాయిలో వైభవ్ జ్యువెలర్స్ ప్రెజెంట్స్ Keinfra Properties గామా అవార్డ్స్

నేచురల్ స్టార్ నాని చిత్రం ది ప్యారడైజ్ కోసం హాలీవుడ్ కొలాబరేషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments