ఫిబ్రవరి 1న పార్లమెంట్‌ మార్చ్‌.. రైతు సంఘాలు

Webdunia
మంగళవారం, 26 జనవరి 2021 (07:50 IST)
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతు సంఘాలు తదుపరి ఉద్యమ కార్యాచరణను ప్రకటించాయి. బడ్జెట్‌ ప్రవేశపెట్టబోయే ఫిబ్రవరి 1న పార్లమెంట్‌ మార్చ్‌ నిర్వహించాలని నిర్ణయించాయి. ఈ మేరకు క్రాంతికారి కిసాన్‌ యూనియన్‌కు చెందిన ప్రతినిధి దర్శన్‌ పాల్‌ సోమవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం ట్రాక్టర్‌ ర్యాలీ తలపెట్టిన వేళ భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటించడం గమనార్హం.
 
నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌ నెరవేరే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని దర్శన్‌ చెప్పారు. ఫిబ్రవరి 1న పార్లమెంట్‌ వైపు వివిధ మార్గాల నుంచి కాలినడకన ప్రదర్శన నిర్వహిస్తామని చెప్పారు. నేటి ట్రాక్టర్‌ ర్యాలీతో రైతుల సామర్థ్యం ఏంటో ప్రభుత్వానికి తెలిసొస్తుందని చెప్పారు. తాము చేపట్టబోయే ప్రదర్శనలు, ఆందోళనలు శాంతియుతంగా జరుగతాయని స్పష్టంచేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమిళ సినీ మూలస్తంభం ఏవీఎం శరవణన్ ఇకలేరు

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments