ప్రధాని నరేంద్ర మోడీ యోధుడు : ములాయం సింగ్ యాదవ్ ప్రశంసలు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై నిత్యం విమర్శనాస్త్రాలతో విరుచుకుపడే సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ ఇపుడు ప్రశంసల వర్షం కురిపించారు. మోడీ యోధుడని కీర్తించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై నిత్యం విమర్శనాస్త్రాలతో విరుచుకుపడే సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ ఇపుడు ప్రశంసల వర్షం కురిపించారు. మోడీ యోధుడని కీర్తించారు.
వచ్చే యేడాది ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎస్పీ ఒంటరిగా పోటీ చేయనుంది. ఇందుకోసం ఆయన 325 మంది అభ్యర్థుల పేర్లతో తొలి జాబితాను ప్రకటించారు.
ఈ సందర్భంగా ములాయం సింగ్ మాట్లాడుతూ... మోడీ యోధుడని ప్రశంసించారు. అదేసమయంలో ఎన్నికల హామీలను నిలబెట్టుకోవడంలో మోడీ విఫలమయ్యారని విమర్శించారు.
కాగా, వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన కుమారుడు, యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సన్నిహితులకు కూడా టికెట్లు ఇచ్చేందుకు నిరాకరించిన ములాయం బీజేపీ సహా ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకోబోమని స్పష్టంచేశారు. 403 స్థానాలున్న యూపీ అసెంబ్లీలో ఎస్పీ బలం 224.