Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐటీ తదుపరి టార్గెట్ శశికళ!... ఏ పదవి చేపట్టినా సరే ఐటీ/ఈడీ దాడులు తప్పవా?

ఆదాయపన్ను శాఖ అధికారుల తదుపరి టార్గెట్‌గా దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రియనెచ్చెలి శశికళ మారినట్టు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె ఏ పదవి చేపట్టినా సరే ఆమెతో ఆమె బంధువుల ఇళ్ళపై దాడులతో విరుచుకుపడాల

Webdunia
గురువారం, 29 డిశెంబరు 2016 (08:38 IST)
ఆదాయపన్ను శాఖ అధికారుల తదుపరి టార్గెట్‌గా దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రియనెచ్చెలి శశికళ మారినట్టు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె ఏ పదవి చేపట్టినా సరే ఆమెతో ఆమె బంధువుల ఇళ్ళపై దాడులతో విరుచుకుపడాలని ఐటీ, ఈడీ అధికారులకు ఆదేశాలు వచ్చాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. 
 
వాస్తవానికి మొన్నటికి మొన్న... రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగ సారథిగా ఉన్న చీఫ్‌ సెక్రటరీ పి. రామ్మోహన్‌ రావు ఇంటిపైనే ఐటీ దాడులు జరిగాయి. ఇపుడు తమిళనాడులో రాజకీయంగా అత్యంత కీలకమైన స్థానంలో ఉన్న వారిపైనా ఐటీ/ఈడీ గురి పెట్టవచ్చుననే ప్రచారం సాగుతోంది. అది కూడా... సాక్షాత్తూ చిన్నమ్మ శశికళ కొలువైన పొయెస్‌ గార్డెన్ బంగళాలోనే ఐటీ అధికారులు అడుగుపెట్టే అవకాశాలున్నట్టు ప్రచారం జోరుగా సాగుతోంది. 
 
జయలలిత మరణం తర్వాత... ఇప్పటిదాకా తమిళనాడులో ఎనిమిది మంది రాజకీయ, అధికార ప్రముఖులపై ఐటీ సోదాలు జరిగాయి. రెండు రోజుల క్రితం పక్క రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ఐటీ, ఇతర శాఖల సిబ్బందిని చెన్నైకి రప్పించారు. కేంద్ర బలగాలను కూడా అదే స్థాయిలో మోహరించారు. ఈ నేపథ్యంలో... ‘ప్రముఖులు’ లక్ష్యంగా ఐటీ సోదాలు జరిగే అవకాశమునట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. 
 
ఇక... పార్టీ పదవి, ముఖ్యమంత్రి పదవిలో ఏది తీసుకున్నా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ‘ఢిల్లీ’ నుంచి శశికళకు హెచ్చరికలు జారీ అయినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా, శశికళకు కేంద్ర ప్రభుత్వంతో ఉన్న సంబంధాలే ఆమె భవిష్యతను నిర్ణయిస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments