Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళను ముందే తాకనున్న నైరుతి రుతుపవనాలు

Webdunia
శనివారం, 21 మే 2022 (08:58 IST)
ఈ దఫా నైరుతి రుతుపవనాలు కేరళ రాష్ట్రాన్ని ముందే తాకనున్నాయి. అదీ కూడా ఈ నెల 25వ తేదీ తర్వాత ఎపుడైనా కేరళలోకి ప్రవేశించవచ్చని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. వచ్చే ఐదు రోజుల్లో కేరళ, కర్నాటకలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు వెల్లడించారు. 
 
దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, దక్షిణ, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు నిన్ననే నైరుతి రుతుపవనాలు విస్తరించినట్టు పేర్కొంది. అదేవిధంగా గత రెండు మూడు రోజులుగా కేరళ, కర్నాటక రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. 
 
వచ్చే ఐదు రోజులుగా ఈ రెండు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ నెల 25వ తేదీ తర్వాత ఎపుడైనా రుతుపవనాలు కేరళ రాష్ట్రాన్ని తాకొచ్చని పేర్కొన్నారు. అలాగే, రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

భారత్ లో విడుదలవుతున్న పాడింగ్టన్ ఇన్ పెరూ చిత్రం

Odela 2: మా నాన్నమ్మనుంచి ఓదెల 2లో నాగసాధు పాత్ర పుట్టింది : డైరెక్టర్ సంపత్ నంది

Anna konidala: డిక్లరేషన్ పై సంతకం పెట్టి స్వామి కి మొక్కులు చెల్లించుకున్న అన్నా కొణిదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments