Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోనూ సూద్‌కు వార్నింగ్ ఇచ్చిన పంజాబ్ అధికారులు

Webdunia
ఆదివారం, 20 ఫిబ్రవరి 2022 (15:50 IST)
పంజాబ్ శాసనసభకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా, ఆదివారం ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. మొగా నియోజకవర్గంలో సోనూ సూద్ సోదరి మాళవికా పోటీ చేస్తున్నారు. అయితే మోగాలోకి సోనూ సూద్ వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ, ఆయన్ను అడ్డుకున్నారు. సోనూ సూద్‌పై శీరోమణి అకాలీదళ అభ్యర్థి బర్జీందర్ సింగ్ అలియాస్ మఖాన్ బ్రార్ ఫిర్యాదు మేరకు అధికారులు ఈ చర్య తీసుకున్నారు. 
 
సోనూ సూద్‌ను అడ్డుకున్న అధికారులు ఆయన కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన్ను ఇంటికి పంపించారు. అయితే, ఇంటి నుంచి బయటకు వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ మేరకు మొగా జిల్లా పీఆర్ఓ దీప్ సింగ్ వెల్లడించారు. అలాగే, ఈ వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని మొగా ఎస్పీని జిల్లా మేజిస్ట్రేట్, కలెక్టర్ హరీశ్ నయ్యర్ ఆదేశించారు. 
 
అయితే, తన పట్ల పంజాబ్ అధికారులు ప్రవర్తించిన తీరుపై సోనూ సూద్ అధికారులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. తనపై ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమన్నారు. ప్రత్యేకించి ఓ పార్టీకి గానీ, ఓ అభ్యర్తికిగాని ఓటు వేయాలని తాను ఎవరినీ ఆడగలేదని చెప్పారు. పోలింగ్ కేంద్రాల వెలుపల ఏర్పాటు చేసిన కాంగ్రెస్ శిబిరాలను సందర్శించడానికి వెళ్ళానని, ఓటర్లను ప్రభావితం చేసేందుకు కాదని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bellam konda: దెయ్యాలుండే హౌస్ లో కిష్కింధపురి షూటింగ్ చేశాం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Ritika Nayak : సెట్ లో బ్రదర్ సిస్టర్ అని పిలుచుకునే వాళ్లం : రితికా నాయక్

సామాన్యుడి గేమ్ షో గా రానున్న ది లక్ - గెలిచిన వారికి కారు బహుమానం

Samyukta Menon: అందం, ఆరోగ్యం ఒకరిని అనుకరించడం కరెక్ట్ కాదు: సంయుక్త మీనన్

మెగాస్టార్ చిరంజీవి ని కలిసిన క్షణం ఎంత మెగా క్షణం విజయ్ సేతుపతి, పూరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

ఫిలడెల్ఫియా నాట్స్ అక్షయపాత్ర ఆధ్వర్యంలో గణేశ్ మహా ప్రసాదం

తర్వాతి కథనం
Show comments