Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఐడీ దాడి కేసు విచారణను త్వరితంగా పూర్తి చేయండి : డీజీపీకి ఆర్ఆర్ఆర్ లేఖ

Webdunia
ఆదివారం, 20 ఫిబ్రవరి 2022 (15:06 IST)
తనపై సీఐడీ దాడి చేసిన కేసు దర్యాప్తును త్వరగా పూర్తి చేయాలని వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కోరారు. ఈ మేరకు ఆయన ఏపీ కొత్త డీజీపీగా బాధ్యతలు చేపట్టిన కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాశారు. ఇందులో తనపై సీఐడీ అధికారుల దాడి ఘటనపై త్వరగా దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి చేశారు. 
 
ఈ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేయాలని ఆయన కోరారు. తప్పుడు కేసులు బనాయించి తనను చిత్రహింసలకు గురిచేశారని డీజీపీకి రఘురామ వెల్లడించారు. ఈ దాడి కేసులో ప్రధానంగా సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ఉన్నారని ఆయన పేర్కొన్నారు. 
 
ఈ దాడి ఘటనపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నివేదిక కోరినప్పటికీ అప్పటి డీజీపీ గౌతం సవాంగ్ స్పందించలేదని పేర్కొన్నారు. లోక్‌సభ స్పీకర్ కోరిక మేరకు దర్యాప్తును పూర్తి చేసి నివేదికను త్వరితగతిన అందజేయాలని ఆయన కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mrunal Thakur: ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవుతున్న మృణాల్ ఠాకూర్ పేరు.. ఎలాగంటే?

పగ, అసూయ, ప్రేమ కోణాలను చూపించే ప్రభుత్వం సారాయి దుకాణం

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 కొత్త సీజన్ : కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏంటవి?

Pawan: ఎన్టీఆర్, ఎంజీఆర్ ప్రేరణతో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించా: జ్యోతి కృష్ణ

సయారా తో ఆడియెన్స్ ఆషికి రోజుల్ని తలుచుకుంటున్నారు : మహేష్ భట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments