Webdunia - Bharat's app for daily news and videos

Install App

చికిత్స కోసం విదేశాలకు వెళ్లనున్న సోనియా గాంధీ

Webdunia
బుధవారం, 24 ఆగస్టు 2022 (08:58 IST)
గత కొంతకాలంగా అనారోగ్యానికి గురవుతూ వస్తున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మెరుగైన వైద్య సేవల కోసం విదేశాలకు వెళ్లనన్నారు. ఆమె వెంట కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంకా గాంధీ వాద్రాలు కూడా వెళ్లనున్నట్టు సమాచారం. 
 
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు పలువురు కీలక బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారు. వీరిలో ఆనంద్ శర్మ, గులాం నబీ ఆజాద్ వంటి వారు ఉన్నారు. ఈ తరుణంలో ఆమె రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో మంగళవారం సమావేశమయ్యారు. ఈ భేటీ చర్చనీయాంశంగా మారింది. 
 
ఈ నేపథ్యంలో మెరుగైన వైద్య చికిత్స కోసం విదేశాలకు వెళ్లాని భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ వెల్లడించారు. కాగా, సోనియా గాంధీ ఇప్పటికే రెండుసార్లు కరోనా వైరస్ బారినపడ్డారు. అంతకుముందు ఆమె తీవ్ర అస్వస్థతకు గురికావడంతో విదేశాలకు వెళ్ళి చికిత్స కూడా చేయించుకున్నారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments