Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోనియా ఉదారత : రాయ్‌బరేలీలో కోవిడ్ రోగుల సేవల కోసం రూ.1.17 కోట్లు

Webdunia
ఆదివారం, 25 ఏప్రియల్ 2021 (14:03 IST)
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తన ఉదారతను చూపించారు. ఉత్తర ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ లోక్‌సభ నియోజకవర్గంలో కోవిడ్-19 సంబంధిత సేవల కోసం నిధులు మంజూరు చేశారు. ఆమె శుక్రవారం రాయ్ బరేలీ జిల్లా మేజిస్ట్రేట్‌కు రాసిన లేఖలో తన ఎంపీ నిధుల నుంచి ఈ సొమ్మును తీసుకుని, కోవిడ్-19 మహమ్మారి బాధితులను కాపాడటం కోసం ఖర్చు చేయాలని కోరారు. 
 
ప్రజలంతా ఇళ్ళలోనే ఉండాలని, అవసరం లేకుండా బయటకు రావద్దని కోరారు. అందరూ కోవిడ్ సంబంధిత మార్గదర్శకాలను పాటించాలని కోరారు. సోనియా గాంధీ రాయ్ బరేలీ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. 
 
ఆక్సిజన్ సకాలంలో అందకపోవడంతో ఐదుగురు కోవిడ్-19 పాజిటివ్ రోగులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఆమె ఈ లేఖ రాశారు. రాయ్‌బరేలీలోని కోవిడ్-19 పాజిటివ్ రోగులకు అవసరమైన సేవలను అందించడం కోసం తన నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి రూ.1.17 కోట్లు కేటాయిస్తున్నట్లు ఈ లేఖలో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu: పారితోషికం మొత్తం తిరిగి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్?!!

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments