Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా హత్యకు ఓ రాజకీయ పార్టీ కుట్ర.. సుపారీ కూడా ఇచ్చింది: మమత బెనర్జీ

కేంద్రంలోని ఎన్డీయేపై నిప్పులు చెరుగుతూ.. సర్కారు విధానాలను తప్పుబట్టే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన హత్యకు కుట్ర జరిగిందని మమత బెనర్జీ ఆరోపించారు. తనను అంతమొందించే

Webdunia
శనివారం, 12 మే 2018 (11:44 IST)
కేంద్రంలోని ఎన్డీయేపై నిప్పులు చెరుగుతూ.. సర్కారు విధానాలను తప్పుబట్టే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన హత్యకు కుట్ర జరిగిందని మమత బెనర్జీ ఆరోపించారు. తనను అంతమొందించేందుకు ఓ రాజకీయ పార్టీ కిరాయి హంతకులను కూడా నియమించుకుందని విమర్శించారు.
 
ఈ మేరకు తనను హతమార్చేందుకు కుట్ర జరిగినట్లు తన దృష్టికి కూడా వచ్చిందని, ఇందుకోసం ఓ పార్టీ సుపారీ కూడా ఇచ్చింది. అడ్వాన్స్ తీసుకున్న కిరాయి హంతకులు తన నివాసం, కార్యాలయం, ఇతర సమీప ప్రాంతాల్లో రెక్కీ కూడా నిర్వహించారంటూ మమత చెప్పుకొచ్చారు. కానీ తనకు ఇవి అలవాటైపోయాయని, గతంలో కుట్రల నుంచి తాను ప్రాణాలతో బయపడ్డానన్నారు.
 
ఇదిలా ఉంటే.. బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలంగాణ సీఎం కేసీఆర్‌‌తో మార్చిలో భేటీ అయ్యారు. దేశ రాజకీయాల్లో మార్పే లక్ష్యమని ప్రకటించిన కేసీఆర్‌‌ జాతీయ రాజకీయాలు, ఫ్రంట్‌ ఏర్పాటుపై మమతా బెనర్జీతో చర్చించిన సంగతి తెలిసిందే. నాన్‌ బీజేపీ, నాన్‌ కాంగ్రెస్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు సహకరించాలని మమతను కేసీఆర్ కోరినట్లు సమాచారం. 
 
మరోవైపు బీజేపీకి, మోడీకి వ్యతిరేకంగా టీడీపీ, వైసీపీలు కేంద్రంపై అవిశ్వాస యుద్ధం చేస్తుంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ కొత్త ఫ్రంట్‌ ఏర్పాటుకు మద్దతు కూడగట్టే పనిలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments