Webdunia - Bharat's app for daily news and videos

Install App

ద్వారకలో మొదలై డిబ్రూఘర్‌లో పరిసమాప్తమైన సూర్యగ్రహణం

Webdunia
ఆదివారం, 21 జూన్ 2020 (17:26 IST)
దేశ వ్యాప్తంగా అమితాసక్తిని కలిగించిన రాహుగ్రస్త సూర్యగ్రహణం ఆదివారం మధ్యాహ్నం ముగిసింది. ఈ సూర్యగ్రహణం తొలుత గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకలో కనిపించింది. చివరగా అస్సాం రాష్ట్రంలోని డిబ్రూఘర్‌లో ఆదివారం మధ్యాహ్నం 3.04 గంటలకు పరిసమాప్తమైంది. 
 
అంతకుముందు ఉదయం 9 గంటల తర్వాత ప్రారంభమైన సూర్యగ్రహణం మధ్యాహ్నం 12 గంటల సమయంలో పూర్తిస్థాయిలో కనువిందు చేసింది. సూర్యుడి మధ్య భాగాన్ని జాబిల్లి పూర్తిగా కప్పేశాడు. ఫలితంగా సూర్యుడు ఓ వలయ రూపంలో (రింగ్ ఆఫ్ ఫైర్)గా కనిపించాడు. దేశంలో వివిధ ప్రాంతాల్లో భిన్న సమయాల్లో సూర్యగ్రహణం కనిపించింది. 
 
ఇక, గ్రహణ ఘడియలు ముగియడంతో దేశవ్యాప్తంగా ఆలయాల్లో సంప్రోక్షణలు మొదలయ్యాయి. ఒక్క శ్రీకాళహస్తి ఆలయం తప్ప దేశంలోని అన్ని ఆలయాలను మూసివేసిన విషయం తెల్సిందే. సూర్యగ్రహణం ముగిసిన నేపథ్యం ఆలయాలు మళ్లీ తెరుచుకున్నాయి. సంప్రోక్షణ ప్రక్రియ అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. 

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments