Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యాహ్నం భోజన పథకంలో పాము ... ఆరగించిన విద్యార్థుల అస్వస్థత

Webdunia
మంగళవారం, 10 జనవరి 2023 (12:39 IST)
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఆ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో మధ్యాహ్న భోజన పథకం ఒకటి. అయితే ఈ పథకం అమలులో సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నారు. దీనికి నిదర్శనమే తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఘటన. ఈ మధ్యాహ్న భోజనంలో వడ్డించే అన్నంలో పాము కనిపించి, ప్రతి ఒక్కరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ అన్నాన్ని ఆరగించిన విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు. దీంతో వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 
 
ఈ ఘటన బీర్భూమ్ జిల్లాలోని మయూరేశ్వర్ బ్లాక్‌లోని ఓ ప్రాథమిక పాఠశాలలో సోమవారం మధ్యాహ్నం భోజనం ఆరగించిన వారిలో దాదాపు 30 మందికి వరకు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. విద్యార్థులకు వడ్డించిచన పప్పులో పాము కనిపించిందని సిబ్బంది పేర్కొన్నారు. 
 
ఈ ఆహారం తిన్న తర్వాత పిల్లులు అస్వస్థతకు గురైనట్టు పలు గ్రామాల నుంచి ఫిర్యాదులు అందాయని బ్లాక్ డెవలప్‌మెంట్ అధికారి దీపాంజన్ జానా వెల్లడించారు. పిల్లలకు వాంతులు కావడంతో రామ్ పూర్ హట్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించామని తెలిపారు. ఈ సంఘటనపై స్థానికుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని ఘెరావ్ చేశారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments