Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏ వ్యక్తినైనా పెళ్లి చేసుకునే ముందు అలా కూర్చోబెడితే...? స్మృతి ఇరానీ

Webdunia
శుక్రవారం, 23 జులై 2021 (23:44 IST)
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. నెటిజన్లను ఆలోచింపజేసే సందేశాలతో ఎప్పుడు ఏదో బకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. తాజాగా పెళ్లి, జీవితానికి సంబంధించిన ఫన్నీ సలహాలను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో స్మృతీ ఇరానీ పోస్ట్ చేశారు. శుక్రవారం ఆమె ఇన్ స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్.. ముఖ్యమైన సందేశాన్ని కూడా తెలియజేసేలా ఉంది.
 
వివాహం విషయానికొస్తే.. ఏ వ్యక్తినైనా పెళ్లి చేసుకునే ముందు ఇంటర్నెట్ చాలా స్లోగా ఉండే కంప్యూటర్ ముందు కూర్చోబెట్టాలి. దీనిని బట్టి ఆయన వ్యక్తిత్వం ఏంటనేది ఇట్టే గ్రహించవచ్చు అంటూ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్‌లో స్మృతీ ఇరానీ తెలిపారు. 
 
అయితే ఆమె మరో పోస్ట్ కూడా చేశారు. ఆంటీ సలహా అంటూ.. ఏ పదార్థమూ పర్‌ఫెక్ట్‌గా ఉండదు. దానిని మనకు తగ్గట్టుగా మలుచుకోవాలి అంటూ స్మృతి ఇరానీ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments