Webdunia - Bharat's app for daily news and videos

Install App

తన మనసింకా అంతరిక్షంలోనే వుంది... వ్యోమగామి శిరీష బండ్ల

Webdunia
మంగళవారం, 13 జులై 2021 (08:34 IST)
వర్జిన్ గెలాక్టిక్ సంస్థ ఆదివారం చేపట్టిన అంతరిక్ష యాత్ర విజయవంతమైంది. ఈ యాత్రలో పాలుపంచుకున్న వ్యోమగాముల్లో భారత సంతతికి చెందిన గుంటూరు జిల్లా యువతి శిరీష బండ్ల (34) కూడా ఉన్నారు. 
 
ప్రపంచ కుబేరుడు సర్ రిచర్డ్ బ్రాన్సన్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం వీఎస్ఎస్ యూనిటీ-22 వ్యోమనౌక చారిత్రాత్మక రీతిలో అంతరిక్ష విహారం చేసి సురక్షితంగా భూమికి తిరిగొచ్చిన విషయం తెల్సిందే. వర్జిన్ గెలాక్టిక్ సంస్థలో పరిశోధన విభాగం వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్న శిరీష బండ్ల కూడా ఈ యాత్రలో భాగమై అంతరిక్ష యానం చేసింది.
 
తన అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి సురక్షితంగా భూమికి చేరిన తర్వాత ఆమె తన తొలి రోదసి యాత్రపై స్పందించారు. తాను పట్టరాని సంతోషంలో మునిగిపోయినట్టు చెప్పారు. అంతరిక్షం నుంచి భూమిని చూడడం ఓ అద్భుతమైన అనుభూతి అని వ్యాఖ్యానించారు. 
 
యాత్ర ముగిసి తాము భూమికి చేరినా, తన మనసింకా అంతరిక్షంలోనే ఉందని వ్యాఖ్యానించారు. అంతరిక్షానికి వెళ్లాలన్నది తన చిన్ననాటి కల అని, ఇన్నాళ్లకు అది సాకారమైందని, అది కూడా సంప్రదాయేతర మార్గంలో నెరవేరిందని శిరీష వెల్లడించారు. ఇప్పటికీ తాను రోదసిలోకి వెళ్లి వచ్చానంటే నమ్మశక్యం అనిపించడంలేదని, ఆ భావన వర్ణనాతీతం అని వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ "ఓజీ" మూవీ టిక్కెట్ ధర రూ.5 లక్షలు - దక్కించుకున్న ఆ ఇద్దరు

9 వారాల సాయిబాబా వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో పూర్తి చేసిన ఉపాసన

Love in Dubai: రాజ్ నిడిమోరుతో దుబాయ్‌కి వెళ్లిన సమంత.. రీల్ వైరల్ అయ్యిందిగా (video)

Prabhas: ఘాటీ రిలీజ్ గ్లింప్స్‌ విడుదలచేస్తూ, ట్రైలర్ ఆకట్టుకుందంటూ ప్రభాస్ ప్రశంసలు

Manoj: తమిళ్ ఆఫర్లు వస్తున్నాయి, అన్ని భాషల్లో సినిమాలు చేయాలి : మనోజ్ మంచు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

తర్వాతి కథనం
Show comments