Webdunia - Bharat's app for daily news and videos

Install App

మలద్వారంలోకి కంప్రషర్ ఎయిర్‌ను పంపి ఉద్యోగిని చంపేసిన యజమాని!

Webdunia
సోమవారం, 28 డిశెంబరు 2020 (16:50 IST)
మలంద్వారంలోకి కంప్రషర్ ఎయిర్‌ను పంపి ఉద్యోగిని యజమాని చంపేశాడు. ఈ దారుణ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని స్థానిక శివపురిలోని గోవర్ధన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. శివపురి ఎస్‌ఐ రాజేశ్ సింగ్ చందేల్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన జరిగి 45 రోజులు గడిచింది. 
 
శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ కేసు వివరాలను వెల్లడించారు. అతడి మరణానికి సంబంధించి తమకు ఎవరూ ఫిర్యాదు ఇవ్వలేదని, అయితే విషయం ఈరోజే తెలియడంతో సంబంధింత అధికారిని దర్యాప్తు కోసం ఆదేశించామని తెలిపారు. 
 
కాగా, మరణించిన వ్యక్తి సోదరుడు దీనిపై మాట్లాడుతూ, ఈ సంఘటన నవంబరు 8న జరిగిందని, ఎప్పటిలానే తన సోదరుడు ఉద్యోగానికి వెళ్లాడని, అయితే మధ్యాహ్నానికి ఓ వ్యక్తి వచ్చి ‘మీ సోదరుడు హాస్పిటల్‌లో ఉన్నాడు. కడుపునొప్పితో బాధపడుతున్నాడు. వెంటనే వెళ్లండి’ అని చెప్పారని, దాంతో హుటాహుటిన వెళ్లి అతడిని కలిసినట్లు చెప్పారు.
 
‘నేను వెళ్లేసరికి అతడు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. విషయం అడగ్గా.. తాను పనిచేసే ఓనర్‌తో పాటు అక్కడ పనిచేసే మరికొంతమంది కలిసి తన మలద్వారంలోకి కంప్రషర్ ఎయిర్‌ను పంపు చేశారని, దానివల్లే తాను కడుపునొప్పితో బాధపడుతున్నానని చెప్పాడు. ఎన్ని ఆస్పత్రులు తిప్పినా డాక్టర్లు చేతులెత్తేశారు. నొప్పి భరించలేక ఆ రోజే అతడు మరణించాడ’ని చెప్పాడు. దీనిపై పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments