Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆన్‌లైన్ క్లాస్‌లో అశ్లీల వీడియో ప్రత్యక్షం, బెదిరిపోయిన విద్యార్థులు

Webdunia
మంగళవారం, 3 ఆగస్టు 2021 (17:19 IST)
కరోనా లాక్డౌన్ తరువాత దేశవ్యాప్తంగా విద్యా సంస్థలు మూసివేశారు. కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తి తర్వాత చాలా పాఠశాలలు ఆన్‌లైన్ తరగతుల ద్వారా పాఠాలు చెపుతున్నాయి. సాంకేతికతపై అతిగా ఆధారపడటం వల్ల ప్రతికూలమైన ఫలితాలు కూడా వస్తున్నాయి. తాజాగా పూణేలో జరిగిన ఒక సంఘటన దీనికి ఉదాహరణ.
 
రాజగురునగర్‌లో ఉన్న ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో టీచర్ విద్యార్థులకు ఆన్‌లైన్ వీడియో చాట్ ప్లాట్‌ఫామ్ జూమ్ ద్వారా ఆన్‌లైన్ క్లాస్ ప్రారంభించారు. కానీ ఆమె ఆన్‌లైన్ లింక్ షేర్ చేయగానే అశ్లీల వీడియో క్లిప్ ప్రత్యక్షమైంది. అభ్యంతరకరమైన వీడియో తెరపైకి రావడంతో విద్యార్థులు చాట్ బాక్స్ ద్వారా టీచర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన గురించి విద్యార్థులు తమ తల్లిదండ్రులకు కూడా తెలియజేశారు.
 
ఈ సంఘటన తర్వాత చాలామంది విద్యార్థులు ఆన్‌లైన్ క్లాస్‌ను నిలిపివేశారు. కానీ ఈ విషయం తెలియని టీచర్ తన ఉపన్యాసాన్ని కొనసాగించింది. అయితే, మరుసటి రోజు విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ప్రిన్సిపాల్‌ను కలవడానికి వెళ్లి అధికారికంగా ఫిర్యాదు చేశారు.
 
సైబర్ నేరగాళ్ల ట్యాంపరింగ్ ఫలితంగా ఈ ఘటన జరిగిందని పాఠశాల నిర్వాహకులు తెలిపారు. ఈ ఘటనపై తమకు పూర్తి అవగాహన ఉందని, విచారణ జరుపుతున్నామని విద్యాశాఖాధికారి సంజయ్ తెలిపారు. సైబర్ నేరస్థుడు హ్యాకింగ్ ద్వారా దుశ్చర్యకు పాల్పడినట్లు పాఠశాల పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇంట్లో విజయ్ దేవరకొండ - కింగ్ డమ్ తో తగలబెడదానికి సిద్ధం !

ఎన్నో అడ్డంకులు అధిగమించి రాబోతున్న హరిహర వీరమల్లు సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా?

గరివిడి లక్ష్మి గాయనే కాదు ఉద్యమమే ఆమె జీవితం.. ఆనంది కి ప్రశంసలు

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం