Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోటి రూపాయల నల్లధనాన్ని పట్టిచ్చిన మహిళ.. పోలీసులు బెదిరింపులు..

నల్ల కుబేరుడి నుంచి లంచం తీసుకుని మహిళ పెట్టిన కేసును విత్ డ్రా చేసుకోమని పోలీసులు బెదిరించిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. కోటి రూపాయల నల్లధనాన్ని పట్టించిన మహిళను అభినందించాల్సిందిపోయి.. మహిళను పోలీసు

Webdunia
శనివారం, 19 నవంబరు 2016 (13:26 IST)
నల్ల కుబేరుడి నుంచి లంచం తీసుకుని మహిళ పెట్టిన కేసును విత్ డ్రా చేసుకోమని పోలీసులు బెదిరించిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. కోటి రూపాయల నల్లధనాన్ని పట్టించిన మహిళను అభినందించాల్సిందిపోయి.. మహిళను పోలీసులు వేధింపులకు గురిచేశారు. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలో జహంగీర్ పురి ప్రాంతానికి చెందిన అష్మినా షియాకా అనే ఓ మహిళ ఓ పాన్ షాపు నడుపుతోంది.
 
ఈ నెల 14 వతేదీన ఓ స్క్రాప్ డీలరు కోటిరూపాయల బ్యాగును ఇంట్లో దాచిపెట్టాడని అష్మినా పోలీసులకు సమాచారం అందించింది. అంతే జహంగీర్ పురి ప్రాంత బీట్ పోలీసులు వచ్చి స్క్రాప్ డీలరు ఇంటిపై దాడి చేసి అతన్ని విచారించేందుకు పోలీసు స్టేషనుకు తీసుకువెళ్లారు. మరునాడు పోలీసులు లంచం తీసుకొని ఆ స్ర్కాప్ డీలరును వదిలిపెట్టారు. 
 
పోలీసులు తన వద్దకు వచ్చి స్క్రాప్ డీలర్‌పై పెట్టిన నల్లధనం కేసును వాపసు తీసుకోవాలని బెదిరించారని మహిళ అష్మినా తెలిపారు. ఈ సంఘటన గురించి ఎవరికీ చెప్పకుండా ఉండేందుకు రూ.2లక్షలు ఇస్తానని పోలీసులు ఆశ చూపించారని అష్మినా ఆరోపించారు. నల్లధనం వ్యవహారం, పోలీసుల తీరుపై అష్మినా డీసీపీ మిలంద్ దుంబ్రేను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై దర్యాప్తు జరుగుతోంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments