Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోటి రూపాయల నల్లధనాన్ని పట్టిచ్చిన మహిళ.. పోలీసులు బెదిరింపులు..

నల్ల కుబేరుడి నుంచి లంచం తీసుకుని మహిళ పెట్టిన కేసును విత్ డ్రా చేసుకోమని పోలీసులు బెదిరించిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. కోటి రూపాయల నల్లధనాన్ని పట్టించిన మహిళను అభినందించాల్సిందిపోయి.. మహిళను పోలీసు

Webdunia
శనివారం, 19 నవంబరు 2016 (13:26 IST)
నల్ల కుబేరుడి నుంచి లంచం తీసుకుని మహిళ పెట్టిన కేసును విత్ డ్రా చేసుకోమని పోలీసులు బెదిరించిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. కోటి రూపాయల నల్లధనాన్ని పట్టించిన మహిళను అభినందించాల్సిందిపోయి.. మహిళను పోలీసులు వేధింపులకు గురిచేశారు. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలో జహంగీర్ పురి ప్రాంతానికి చెందిన అష్మినా షియాకా అనే ఓ మహిళ ఓ పాన్ షాపు నడుపుతోంది.
 
ఈ నెల 14 వతేదీన ఓ స్క్రాప్ డీలరు కోటిరూపాయల బ్యాగును ఇంట్లో దాచిపెట్టాడని అష్మినా పోలీసులకు సమాచారం అందించింది. అంతే జహంగీర్ పురి ప్రాంత బీట్ పోలీసులు వచ్చి స్క్రాప్ డీలరు ఇంటిపై దాడి చేసి అతన్ని విచారించేందుకు పోలీసు స్టేషనుకు తీసుకువెళ్లారు. మరునాడు పోలీసులు లంచం తీసుకొని ఆ స్ర్కాప్ డీలరును వదిలిపెట్టారు. 
 
పోలీసులు తన వద్దకు వచ్చి స్క్రాప్ డీలర్‌పై పెట్టిన నల్లధనం కేసును వాపసు తీసుకోవాలని బెదిరించారని మహిళ అష్మినా తెలిపారు. ఈ సంఘటన గురించి ఎవరికీ చెప్పకుండా ఉండేందుకు రూ.2లక్షలు ఇస్తానని పోలీసులు ఆశ చూపించారని అష్మినా ఆరోపించారు. నల్లధనం వ్యవహారం, పోలీసుల తీరుపై అష్మినా డీసీపీ మిలంద్ దుంబ్రేను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై దర్యాప్తు జరుగుతోంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అందరి బుర్రలు ఒకేలా ఆలోచించవు కదా : సురేఖా వాణి

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments